ప్రశ్నిస్తా.. అంటూ పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నాలుగేళ్లపాటు ట్విట్టర్కే పరిమితం అయ్యారు. అడపాదటపా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేసినా.. 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషిచేసిన పవన్పై అధికార టీడీపీ సానుకూలంగానే స్పందించింది. రాజధాని భూములు, ఉద్దానం విషయంలో పవన్ సలహాలను తీసుకున్నారు. కొన్ని సందర్భాల్లో పవన్ తెలుగుదేశం నాయకులపై విమర్శలు గుప్పించినా.. సైలెంట్గా ఉండాలంటూ చంద్రబాబు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడంతో జనసేన- టీడీపీ మైత్రి మొన్నటి వరకూ బాగానే సాగింది.
అయితే దీనివల్ల ఎక్కువ లాభపడింది టీడీపీనే అయినప్పటికీ జనసేన పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. ఆయన డైరెక్షన్లోనే జనసేన నడుస్తోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే.. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న తెలంగాణలో పవన్ చేపట్టిన యాత్ర కూడా బాబు డైరెక్షనే అంటూ ప్రచారం జరిగింది.
ఇక వీళ్ల మైత్రీబంధం గురించి ప్రతిపక్ష వైసీపీ సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వీటిని తప్పికొట్టే ప్రయత్నం కూడా పవన్ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో ఏదో రహస్య ఒప్పందం కుదర్చుకున్నారని.. పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ కళ్యాణ్, పావలా కళ్యాణ్ అంటూ విమర్శల దాడి చేశారు వ్యతిరేక వర్గం. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తా? ప్యాకేజీలకు లొంగే నైజం జనసైకుడిలో ఉందా? అనే ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు. అయితే ప్రజల్లో ఉన్న ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. పవన్ కళ్యాణ్ను తాను చాలా దగ్గర నుండి చూశానని ఆయన వ్యక్తిత్వం ఏంటో.. ఎలా ఉంటారో మీడియాకి వివరించారు తమ్మారెడ్డి.
పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవడం.. ప్యాకేజీలకు లొంగేవాడా అన్న ప్రశ్నకు సమధానంగా.. ‘చచ్చినా ఉండదు. సమస్యే లేదు. అతను ఓ మూడీ మనిషి. ఏ మూడ్ వస్తే అది చేస్తాడు. అది మంచా చెడా అని చూడడు. అతని లోకంలో అతను ఉంటాడు. అతని లోకం అప్పుడు పడింది (టీడీపీతో). ఇప్పుడు పడటం లేదు అన్నారు.
అయితే తాజాగా మోడీ పవన్ కళ్యాణ్ మూడ్ని మార్చరా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘ఏంటి రహస్యంగా పిలిచేది? నాలుగు సంవత్సరాల పాటు పవన్తో టీడీపీ దోస్తీ చేసింది.. అప్పుడు పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే సంయమనం పాటించాలని చంద్రబాబు అసెంబ్లీలో సైతం అన్నారన్నారు. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ అదీ ఇదీ అంటూ మాట్లాడుతున్నారు.
ఇవ్వాల అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన అవసరం ఏంటి? ఇది అసెంబ్లీలో మాట్లాడే విషయమా? ఎందుకు పవన్ గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ అనేది పబ్లిక్ కోసం, ప్రజలకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు... అంతేకాని వీళ్ల పర్సనల్ విషయాల కోసం కాదు, నలభైఏళ్ల జీవిత చరిత్రను చెప్పుకునేందుకు కాదు. ప్రతి నిమిషం ప్రజల కోసం వెచ్చించాలన్నారు. ఒకవేళ పవన్ గురించి ప్రజలకు చెప్పాల్సి వస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాలంటూ హితవు పలికారు తమ్మారెడ్డి భరద్వాజ.
అయితే దీనివల్ల ఎక్కువ లాభపడింది టీడీపీనే అయినప్పటికీ జనసేన పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని.. ఆయన డైరెక్షన్లోనే జనసేన నడుస్తోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే.. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్న తెలంగాణలో పవన్ చేపట్టిన యాత్ర కూడా బాబు డైరెక్షనే అంటూ ప్రచారం జరిగింది.
ఇక వీళ్ల మైత్రీబంధం గురించి ప్రతిపక్ష వైసీపీ సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వీటిని తప్పికొట్టే ప్రయత్నం కూడా పవన్ చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ టీడీపీతో ఏదో రహస్య ఒప్పందం కుదర్చుకున్నారని.. పవన్ కళ్యాణ్ని ప్యాకేజ్ కళ్యాణ్, పావలా కళ్యాణ్ అంటూ విమర్శల దాడి చేశారు వ్యతిరేక వర్గం. అయితే నిజంగా పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తా? ప్యాకేజీలకు లొంగే నైజం జనసైకుడిలో ఉందా? అనే ప్రశ్నలకు ఆన్సర్ దొరకలేదు. అయితే ప్రజల్లో ఉన్న ఈ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. పవన్ కళ్యాణ్ను తాను చాలా దగ్గర నుండి చూశానని ఆయన వ్యక్తిత్వం ఏంటో.. ఎలా ఉంటారో మీడియాకి వివరించారు తమ్మారెడ్డి.
పవన్ కళ్యాణ్ అమ్ముడు పోవడం.. ప్యాకేజీలకు లొంగేవాడా అన్న ప్రశ్నకు సమధానంగా.. ‘చచ్చినా ఉండదు. సమస్యే లేదు. అతను ఓ మూడీ మనిషి. ఏ మూడ్ వస్తే అది చేస్తాడు. అది మంచా చెడా అని చూడడు. అతని లోకంలో అతను ఉంటాడు. అతని లోకం అప్పుడు పడింది (టీడీపీతో). ఇప్పుడు పడటం లేదు అన్నారు.
ఇవ్వాల అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన అవసరం ఏంటి? ఇది అసెంబ్లీలో మాట్లాడే విషయమా? ఎందుకు పవన్ గురించి అసెంబ్లీలో మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీ అనేది పబ్లిక్ కోసం, ప్రజలకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు... అంతేకాని వీళ్ల పర్సనల్ విషయాల కోసం కాదు, నలభైఏళ్ల జీవిత చరిత్రను చెప్పుకునేందుకు కాదు. ప్రతి నిమిషం ప్రజల కోసం వెచ్చించాలన్నారు. ఒకవేళ పవన్ గురించి ప్రజలకు చెప్పాల్సి వస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పాలంటూ హితవు పలికారు తమ్మారెడ్డి భరద్వాజ.