యాప్నగరం

నటుడు జనార్థనరావు కన్నుమూత.. 1000 పైగా చిత్రాల్లో నటించి

టాలీవుడ్‌లో వేయికి పైగా చిత్రాల్లో నటించిమెప్పించిన సీనియర్ నటుడు జనార్థనరావు అనారోగ్యంతో శుక్రవారం నాడు మరణించారు.

Samayam Telugu 7 Mar 2020, 9:08 am
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియ‌ర్ న‌టుడు జ‌నార్ధ‌న్‌రావు చెన్నైలో శుక్ర‌వారం (మార్చి 6) ఉద‌యం అనారోగ్యంతో క‌న్నుమూశారు. గుంటూరు జిల్లా పొనిగ‌ళ్ల గ్రామంలో జ‌న్మించిన జ‌నార్ధ‌న్ రావు వెయ్యికి పైగా తెలుగు చిత్రాలు, ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించి తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి.
Samayam Telugu Janardhana Rao Passed Away
జనార్థన రావు


చివరిగా జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన ఈయన గతకొన్నాళ్లుగా అనారోగ్యంతో వైద్యం సహాయం పొందుతున్నారు. అమ్మోరు, పెదరాయుడు, మజ్ను, కొండవీటి సింహం, పెదరాయుడు, అమ్మోరు, గోరింటాకు తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చారు. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు జనార్థనరావు. ‘గోకులంలో సీత‌’, ‘త‌లంబ్రాలు’ వంటి సీరియ‌ల్స్‌లోనూ న‌టించి మెప్పించారు. ఇక సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వివిధ అసోషియేషన్స్‌లో తన సేవలను అందిచారు. సౌత్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్‌ సభ్యుడిగా పనిచేసిన ఆయన సేవలకు గాను జాయింట్ సెక్ర‌ట‌రీ అయ్యారు. ఈయన మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.