యాప్నగరం

Writer Vamsi Rajesh: కరోనాతో రచయిత మృతి.. విషాదంలో డైరెక్టర్ శ్రీను వైట్ల

తెలుగు సినీ పరిశ్రమల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా బారిన పడి చాలా మంది కన్నుమూస్తున్నారు. తాజాగా కథా రచయిత కరోనాకు బలయ్యారు.

Samayam Telugu 12 Nov 2020, 6:54 pm
కరోనా మహమ్మారి తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదానికి కారణమవుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. కరోనా సోకిన సినీ ప్రముఖుల్లో కొంత మంది కోలుకోగా.. మరికొందరు మృత్యువాత పడ్డారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి దిగ్గజ గాయకుడిని మన నుంచి దూరం చేసింది ఈ మాయదారి కరోనా. తాజాగా మరో సినీ ప్రముఖుడు కరోనాకు బలైపోయారు.
Samayam Telugu శ్రీను వైట్ల, వంశీ రాజేష్
Sreenu Vaitla, Vamsi Rajesh


వర్ధమాన కథా రచయిత కొండవీటి వంశీ రాజేష్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వంశీ రాజేష్ కన్నుమూసిన విషయాన్ని దర్శకుడు శ్రీను వైట్ల ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. రాజేష్ మృతిని తాను నమ్మలేకపోతున్నాని పేర్కొన్నారు.

‘‘ప్రతిభావంతుడైన రచయిత వంశీ రాజేష్ మరణ వార్త విని షాక్‌కు గురయ్యాను. చాలా బాధగా ఉంది. నాకు మధురమైన జ్ఞాపకాలను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. నా జీవితంలో ఆయన్ని మరిచిపోవడం అంటూ జరగదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వంశీ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని శ్రీను వైట్ల పేర్కొన్నారు.
శ్రీను వైట్ల సినిమాలకు స్టోరీ రైటింగ్ విభాగంలో వంశీ పనిచేశారు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాకు రచనా విభాగంలో తన వంతు పాత్ర పోషించారు. ఆ తరవాత రవితేజ-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాకు కథ అందించారు. పూర్తి స్థాయి కథా రచయితగా తొలిసారి ఈ సినిమాకు పనిచేశారు. ఆయన చివరిగా ‘శబ్దం’ సినిమాకు పనిచేశారు. ఇది కూడా 2018లో విడుదల కావాల్సిన సినిమా.. కానీ ఇప్పటికీ ఇంకా రాలేదు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.