యాప్నగరం

బరిలో ముగ్గురు యంగ్ హీరోలు!

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఆగస్ట్ 11న లాంగ్ వీకెండ్ కావడంతో దాని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించారు.

TNN 9 Jul 2017, 10:30 pm
టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు ఆగస్ట్ 11న లాంగ్ వీకెండ్ కావడంతో దాని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నించారు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లు సైతం తమ సినిమాలు మొదట ఆ రోజునే విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. దీంతో ఇప్పుడు యంగ్ హీరోలు ఆ డేట్‌పై ఫోకస్ పెట్టారు. సాయి ధరం తేజ్ నటిస్తోన్న 'జవాన్', రానా నటిస్తోన్న 'నేనే రాజు నేనే మంత్రి', నితిన్ కొత్త చిత్రం 'లై', బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న 'జయ జానకి నాయక' చిత్రాలు కూడా అదే రోజున రాబోతున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు 'జవాన్' సెప్టెంబర్ నెలకు వెళ్లిపోయాడు. ఇప్పుడు బరిలో ముగ్గురు హీరోలు నిలబడబోతున్నారు.
Samayam Telugu tollywood three young heroes ready to fight on aug 11
బరిలో ముగ్గురు యంగ్ హీరోలు!


'అ ఆ' సినిమాతో యాభై కోట్ల మార్కెట్‌ను నితిన్ చేరుకున్నప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం త్రివిక్రమ్, సమంతలకు వెళ్లిపోయింది. దీంతో హను రాఘవపూడి దర్శకత్వంలో 'లై' సినిమాతో తన స్టామినా ఏంటో చూపించాలనుకుంటున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. అలానే బోయపాటి డైరెక్ట్ చేస్తోన్న 'జయ జానకి నాయక' సినిమాపై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా కూడా ఆగస్ట్ 11నే రాబోతుంది. ఇక రానా 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా టీజర్‌తోనే అంచనాలు అమాంతం పెంచేశాడు. మొత్తానికి ఈ మూడు సినిమాలపై కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మరి ఏ సినిమా లాంగ్ వీకెండ్‌లో తన సత్తా చాటుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.