యాప్నగరం

ఎన్నాళ్లకెన్నాళ్లకో.. చిరు, నాగ్‌, వెంకీ!

టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పులకించిపోయారు.

TNN 13 Nov 2017, 1:04 pm
టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు సీనియర్ అగ్రహీరోలు ఒకే వేదికపై కనిపించడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా పులకించిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ముగ్గురూ వేదికపై తళుక్కుమనడంతో కెమెరా కన్నులు క్లిక్ మన్నాయి. అరుదుగా కనిపించే ఈ అపురూప దృశ్యం అభిమానులను ఖుషీ చేస్తుంది. అయితే ఈ ముగ్గురూ కొత్తగా సినిమా ఏం చేయడంలేదు కాని.. సమంత- నాగచైతన్యల వివాహ రిసెప్షన్‌లో ఈ ముగ్గురు హీరోలు సందడి చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సామ్-చైతూ వివాహ రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరుకాగా.. చిరు, వెంకటేష్, నాగార్జునలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
Samayam Telugu tollywood top stars attend samantha and naga chaitanya hyderabad wedding reception
ఎన్నాళ్లకెన్నాళ్లకో.. చిరు, నాగ్‌, వెంకీ!


కాగా అక్టోబర్ 6న సమంత-నాగచైతన్యల వివాహం గోవాలో కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వివాహానికి టాలీవుడ్ చెందిన ప్రముఖులు హాజరు కాలేదు. దీంతో తెలుగు పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, నాని, సూపర్ స్టార్ క్రిష్ణ ఫ్యామిలీ, క్రిష్ణంరాజు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, మురళిమోహన్, నరేష్, కీరవాణి, దేవీశ్రీప్రసాద్‌, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే మొదలైన తారగణంతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.