'సరైనోడు' సినిమా తరువాత బన్నీ, హరీష్ శంకర్తో సినిమా చేస్తున్నాడని.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ సినిమాలో బన్నీ సరసన శృతిహాసన్ మరోసారి జత కట్టనుందని కూడా అన్నారు. అయితే ఈ విషయాలపై అధికార ప్రకటన మాత్రం ఏదీ రాలేదు. రీసెంట్గా జరిగిన 'సైమా' అవార్డ్స్ కార్యక్రమంలో బన్నీని తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పకుండా దాటేశాడు. కొద్దిసేపటి తర్వాత 'దిల్ రాజు ప్రొడక్షన్లో హరీష్ శంకర్ గారితో ఏదో అనుకుంటున్నాం' అని సమాధానం చెప్పాడు. ఈ 'ఏదో అనుకుంటున్నాం' అని చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది. నిజానికి హరీష్ శంకర్, బన్నీకి లైన్ మాత్రమే చెప్పాడు. ఫుల్ స్క్రిప్ట్ ఇంకా సిద్ధం కాలేదు. కథల విషయంలో బన్నీ పక్కాగా ఉంటాడు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అవ్వకుండా సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లడు. అందుకే హరీష్ సినిమా విషయంలో ఇంకా గోప్యత వహిస్తున్నాడు. బన్నీకి నచ్చే విధంగా హరీష్ కథ సిద్ధం చేయకపోతే ఈ సినిమా ఉండదనే విషయంలో సందేహంలేదు. ఫైనల్గా వీరి కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి మరి..!
బన్నీ-హరీష్ల సినిమా డౌటే!
'సరైనోడు' సినిమా తరువాత బన్నీ, హరీష్ శంకర్తో సినిమా చేస్తున్నాడని.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని
Samayam Telugu 10 Jul 2016, 12:55 pm