యాప్నగరం

హీరోయిన్ భర్తతో లింక్స్ వున్న బిల్డర్‌పై పోలీసుల నిఘా

రూ.2000 కోట్ల విలువ చేసే డ్రగ్ డీలింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి భర్తతో సంబంధాలు..

TNN 21 May 2016, 6:13 pm
రూ.2000 కోట్ల విలువ చేసే డ్రగ్ డీలింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి మమతా కులకర్ణి భర్త విక్కీ గోస్వామితో సంబంధాలు కలిగి వున్నాడనే అనుమానంతో ముంబైకి చెందిన టాప్ బిల్డర్ షబ్బీప్ పటేల్‌పై థానె క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నిఘా పెట్టారు. ఆస్కార్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి మేనేజింగ్ డైరెక్టర్ అయిన పటేల్‌కి ముంబై, దుబాయ్‌లలో వ్యాపారాలున్నాయి. గోస్వామితో పటేల్‌కి సంబంధాలున్నట్టుగా తమ వద్ద ఆధారాలున్నందున త్వరలోనే అతడికి సమన్లు జారీ చేయనున్నామని థానె డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరాగ్ మనెరె( క్రైమ్ బ్రాంచ్ ) తెలిపారు. వెర్సోవాలోని ఆర్సీ కాంప్లెక్స్‌లో 101, 201, 701 ఫ్లాట్లని మమతా కులకర్ణి కొనుగోలు చేసింది కూడా ఈ షబ్బీర్ నుంచేనని.. ఆ ఫ్లాట్లకి నామినీలుగా మమతా కులకర్ణి సోదిరతోపాటు గోస్వామి వున్నాడని పోలీసులు చెబుతున్నారు.
Samayam Telugu top city builder with links to mamta kulkarnis husband under scanning
హీరోయిన్ భర్తతో లింక్స్ వున్న బిల్డర్‌పై పోలీసుల నిఘా




ఇదిలావుంటే, ప్రస్తుతం దుబాయ్‌లో వున్న పటేల్ మాత్రం ఈ ఆరోపణలని కొట్టిపారేశారు. ఈ వివాదానికి తన కొడుకే అసలు కారణం అని అభిప్రాయపడుతున్న పటేల్... 'గోస్వామితో తనకి పరిచయం లేదు సరికదా అసలు అతడు ఎవరో కూడా తనకి తెలియదు' అని అంటున్నాడు. 'గోస్వామితో తనకి ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవు. మంగళవారం ఇండియాకు తిరిగొచ్చాకా పోలీసులకి ప్రతీది వివరిస్తాను' అని చెబుతున్నాడు పటేల్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.