కొన్నేళ్ల క్రితం త్రిష తన పెళ్లి వార్తలతో హల్ చల్ చేసింది. బిజినెస్ మ్యాన్, సినీ నిర్మాత అయిన వరుణ్ మణియన్ ని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఘనంగా నిశ్చితార్థం అయ్యాక కొన్ని రోజులకే ఈ జంట పెళ్లిని రద్దు చేసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయింది. వీరిద్దరు విడిపోవడానికి కారణం... సినిమాలలో త్రిష నటించకూడదన్న నియమమేనని అంటారు సినీజనాలు. త్రిష తన పెళ్లి కన్నా సినిమాలకే ఎక్కువ విలువిచ్చిందని చెబుతారు.
కాగా ఇప్పుడు వరున్ మణియన్ మరో హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తెలుగులో ఆవకాయ్ బిర్యానీ సినిమాతో ఎంటరైన బిందు మాధవి. కొన్ని నెలలుగా వరుణ్-బిందు మాధవి సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వస్తున్నాయి. బిందు మాధవి గతేడాది జులై 1న విడుదలైన దొర సినిమా తరువాత ఏ సినిమాకు సంతకం చేయలేదు. దీనికి వరుణ్ తో ఉన్న అనుబంధమే కారణమని కూడా టాక్. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాతో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఇప్పుడు వరున్ మణియన్ మరో హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తెలుగులో ఆవకాయ్ బిర్యానీ సినిమాతో ఎంటరైన బిందు మాధవి. కొన్ని నెలలుగా వరుణ్-బిందు మాధవి సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వస్తున్నాయి. బిందు మాధవి గతేడాది జులై 1న విడుదలైన దొర సినిమా తరువాత ఏ సినిమాకు సంతకం చేయలేదు. దీనికి వరుణ్ తో ఉన్న అనుబంధమే కారణమని కూడా టాక్. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాతో చక్కర్లు కొడుతున్నాయి.