యాప్నగరం

త్రిష చనిపోయిదంటూ వికృత పోస్టింగ్‌లు

సోషల్ మీడియాలో అసహనం హద్దులు మీరిపోయిందనడానికి మరో ఉదాహరణ ఇది.

Samayam Telugu 14 Jan 2017, 12:07 pm
సోషల్ మీడియాలో అసహనం హద్దులు మీరిపోయిందనడానికి మరో ఉదాహరణ ఇది. జల్లికట్టు అనాగరికం అంటూ దాని నిషేదానికి కారణమైన పెటా సంస్థ, పెటాకు ప్రచాకర్తలుగా ఉన్న సెలబ్రిటీలపై తమిళనాడులో కొంతమంది వికృతచేష్టలకు దిగారు.
Samayam Telugu trisha is no more social media plays with heroines life
త్రిష చనిపోయిదంటూ వికృత పోస్టింగ్‌లు


‘పెటా ప్రచారకర్త..త్రిష ఇక లేరు’ అంటూ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టింగులు పెట్టారు. తనను అసహనంతో కొందరు సోషల్ మీడియాలో చంపేసిన వైనాన్ని త్రిషనే ట్విట్టర్ లో వివరించింది. ‘ఇదేనా తమిళ సంస్కృతి?’ అంటూ నిలదీశారు.

జల్లికట్టుపై తాను ఒక్కమాటకూడా మాట్లాడకపోయినా తనను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. మహిళలు, వారి కుటుంబాలను బాధపెట్టడమే తమిళ సంస్కృతి, సంప్రదాయమా? అంటూ ప్రశ్నించింది.

జల్లికట్టు నిర్వహణకు సుప్రీంకోర్టుకు వెళ్లిన అనుమతి దక్కలేదు. దీంతో కొందరు ఇలాంటి పనికిమాలిన చర్యలకు దిగుతున్నారు.

ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని త్రిష స్పష్టం చేసింది. త్రిషకు తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీతో పెటా సంస్థ అండగా నిలిచింది.

That bein said,I am shocked n mortified at d haters n d kind of filthy language bein used jus bcoz u have free access 2 social media. pic.twitter.com/oCX0Tvbsgj— Trisha Krishnan (@trishtrashers) January 14, 2017

Secondly,I have never spoken against Jallikattu at any given point.Thank u @iam_str for making my stand clear and takin up for me as always— Trisha Krishnan (@trishtrashers) January 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.