యాప్నగరం

విభేదాల కారణంగా సీక్వెల్ నుంచి త్రిష వాకౌట్

అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన సినిమాలు చేసిన త్రిష ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు

TNN 23 Oct 2017, 5:55 pm
అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన సినిమాలు చేసిన త్రిష ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించిన సీక్వెల్‌కి సైన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలీదు కానీ తాను ఆ సినిమా నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది త్రిష. 2003లో రిలీజైన సామి సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్ సరసన ఇద్దరు హీరోయిన్స్‌కి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించే అవకాశం వుంది. అందులో ఒకరు కీర్తి సురేష్ కాగా మరొక హీరోయిన్‌గా త్రిష సైన్ చేసింది.
Samayam Telugu trisha walks out of the saamy sequel after differences
విభేదాల కారణంగా సీక్వెల్ నుంచి త్రిష వాకౌట్


సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా నుంచి తాను వాకౌట్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించిన త్రిష.. అందుకు క్రియేటివ్ డిఫ్రెన్సెసే కారణం అని ఆ పోస్టులో పేర్కొంది. సామి 2 టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ త్రిష తీసుకున్న ఈ నిర్ణయం వెనుకున్న అసలు కారణం ఏమై వుంటుందా అని కోలీవుడ్ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

Due to creative differences,I have chosen to opt out of Saamy 2 . Wishing the team goodluck.— Trisha Krishnan (@trishtrashers) October 23, 2017
సినిమాలో కీర్తి సురేష్ పాత్రకి, త్రిష పాత్రకు మధ్య వున్న ప్రాధాన్యత వ్యత్యాసమే ఈ విభేదాలకు కారణమై వుంటుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అన్నట్టు తమిళంలో 2003లో వచ్చిన సామి అనే సినిమానే తెలుగులో బాలయ్య బాబు హీరోగా లక్ష్మీ నరసింహ అనే టైటిల్ రీమేక్ అయి విజయం సాధించిన సంగతి తెలిసిందే కదా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.