యాప్నగరం

ఉపాసన ఇంట విషాదం.. శోకసంద్రంలో కుటుంబం

ఉపాసన భావోద్వేగంతో ట్వీట్ చేశారు. కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలంటూ ఆమె పేర్కొన్నారు. దీనిపై మెగా అభిమానులంతా స్పందిస్తున్నారు.

Samayam Telugu 27 May 2020, 11:27 am
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతి రావు (92) మంగళవారం కన్నుమూశారు. రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. వయస్సు పైబడడం వలన ఆయన తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తుంది.
Samayam Telugu ఉపాసన కొణిదెల


తెలంగాణలోని దోమరకొండలో జన్మించిన ఉపాసన తాత ఉమాపతి రావు ఐఏఎస్ ఆఫీసర్‌గా పని చేశారు. మొట్ట మొదటి టీటీడీ ఈవోగా కూడా పనిచేశారు. ఉర్దూలో కూడా ఆయన షాయరీలు (కవితలు) కూడా రాశారని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉమాపతి రావు 1928 జూన్ 15న జన్మించారు. ఆయన మృతితో ఉపాసన భావోద్వేగానికి గురైంది. తన సోషల్ మీడియా పేజ్‌ ద్వారా నివాళులు అర్పించింది. మీరందరు కన్నీటి ద్వారా కాకుండా చిరునవ్వుతో ప్రేమని కురిపించాలంటూ స్పష్టం చేసింది. ఉపాసన సన్నిహితులు, మెగా అభిమానులు ఉమాపతి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.