యాప్నగరం

Upasana: మాతృత్వంపై ఉపాసన కొణిదెల.. అత్తమ్మను మిస్ అవుతున్నట్లు ఇన్‌స్టా పోస్ట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇక మరికొద్ది రోజుల్లో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల నుంచి ఆశీర్వాదాలు కోరుతూ తల్లి, గ్రాండ్ పేరెంట్స్‌తో పాటు ఆంటీలతో కలిసున్న ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో రాంచరణ్ తల్లి లేకపోవడంతో ‘మిస్సింగ్ అత్తమ్మ’ అంటూ మెన్షన్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Authored bySanthosh Damera | Samayam Telugu 16 Dec 2022, 1:22 pm

ప్రధానాంశాలు:

  • ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన ఉపాసన కొణిదెల
  • తల్లి కాబోతున్నందున బ్లెస్సింగ్స్ కోరుతూ పోస్ట్
  • అత్తమ్మ సురేఖను మిస్ అవుతున్నట్లుగా నోట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Upasana Konidela
ఉసాసన ఫ్యామిలీ
రామ్ చరణ్ (Ram Charan)), ఉపాసన (Upasana).. త్వరలోనే తమ జీవితంలోకి మొదటి బిడ్డను స్వాగతించబోతున్నారు. ఈ శుభవార్తను రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి, సురేఖ కొణిదెలతో పాటు ఉపాసన తల్లిదండ్రులు అనిల్, శోభన కామినేని తరఫున ట్విట్టర్‌ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఇక మాతృత్వం గురించి ఉత్సాహంగా ఉన్న ఉపాసన.. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా ఆ విషయాన్ని తెలిపింది.
View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న ఉపాసన.. ఈ సందర్భంగా తల్లి శోభనా కామినేని, గ్రాండ్ మదర్స్, అత్తలతో పాటు తన జీవితంలో ఇంపార్టెంట్ మహిళల నుంచి ఆశీర్వాదం కోరుతూ కొన్ని బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్స్ షేర్ చేసింది. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో అత్తమ్మ సురేఖ కొణిదెలను మిస్ అవుతున్నట్లుగా కూడా పేర్కొంది. ‘నా జీవితంలో అత్యంత ముఖ్యమైన మహిళల ఆశీర్వాదంతో మాతృత్వంలోకి ప్రవేశిస్తున్నాను. మిస్సింగ్ అత్తమ్మ’ అని ఫొటోతో పాటు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అయితే, ‘వాల్తేర్ వీరయ్య’ షూటింగ్ కోసం చిరంజీవి ఇటీవలే యూరప్‌లో వెళ్లారు. ఈ ట్రిప్‌కు ఆయన వైఫ్ సురేఖ కూడా వెళ్లగా.. ఈ శుభ వార్తను కూడా అక్కడి నుంచే ప్రకటించారు. వారు తిరిగొచ్చేందుకు ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అత్తమ్మ సురేఖ లేకపోవడంతో ఆమెను మిస్ అవుతున్నట్లు వెల్లడించింది ఉపాసన.

ఇక రామ్‌చరణ్, ఉపాసనలు చెన్నైలో చదువుకునే రోజుల్లోనే ఒకరికొకరు పరిచయం కాగా.. చాలా కాలం తర్వాత ప్రేమలో పడ్డారు. 2011లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట జూన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయ్యి దాదాపు పదేళ్లు గడిచిన పిల్లల్ని కనలేదు. ఈ విషయమై అనేకసార్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనా ప్రస్తుతం తాను ప్రెగ్నెంట్ కావడంతో మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటోంది.

కెరీర్ విషయానికి వస్తే.. ఉపాసన కామినేని సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమన్. తను అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్, ఫ్యామిలీ హెల్త్ ప్లాన్ ఇన్సూరెన్స్ TPA LTD మేనేజింగ్ డైరెక్టర్. మరోవైపు.. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో #RC15 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీని తర్వాత చెర్రీ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరొక సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇదేగాక రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌ను 2025 నాటికి సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.

రచయిత గురించి
Santhosh Damera
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్\u200cగా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్\u200cటైన్\u200cమెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్\u200cడేట్స్, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, లైఫ్\u200cస్టైల్ స్టోరీస్, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.