యాప్నగరం

మెగాహీరోను బాగానే వాడారట!

సందీప్ కిషన్, రెజీనా జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నక్షత్రం'. ఈ సినిమాలో మెగాహీరో సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు.

TNN 3 Apr 2017, 8:04 pm
సందీప్ కిషన్, రెజీనా జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'నక్షత్రం'. ఈ సినిమాలో మెగాహీరో సాయి ధరం తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అనేది కృష్ణవంశీకు చాలా ముఖ్యం. దానికోసమే ఏ సినిమాకు పెట్టనంత ఎఫర్ట్ ఈ సినిమా కోసం పెడుతున్నాడు.
Samayam Telugu update on sai dharam tejs role in nakshatram
మెగాహీరోను బాగానే వాడారట!


ప్రమోషన్ పరంగా కూడా కేర్ తీసుకుంటున్నాడు. సినిమాకు మార్కెట్‌లో క్రేజ్ రావాలనే సాయి ధరం తేజ్‌ను వాడుకుంటున్నాడు. మాస్‌లో తేజుకి మంచి పేరే ఉంది. కమర్షియల్‌గా సినిమా వర్కవుట్ కావాలంటే మాస్‌కి రీచ్ అవ్వాలి. అందుకే మొదట గెస్ట్ రోల్ అనుకున్న సాయి ధరం తేజ్ పాత్ర ఇప్పుడు మరో హీరో స్థాయికి చేరింది.

10 నిమిషాలు తెరపై కనిపిస్తే చాలని తేజుకి చెప్పిన కృష్ణవంశీ ఇప్పుడు ఆ పాత్ర నిడివిని 35 నిమిషాలు చేశాడు. ఆయనపై రెండు పాటలను కూడా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒక పాట మినహా మొత్తం పూర్తయింది. అది కూడా ఓ ఐటెమ్ సాంగ్. కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన వారే ఈ ఐటెమ్ సాంగ్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.