గత ఏడాది ‘నిన్నుకోరి’ చిత్రంలో ‘అడిగా అడిగా ఎదలో లయనడగా’.. అంటూ ప్రేమగీతాన్ని వినిపించిన నేచురల్ స్టార్ నాని.. తన తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’లోనూ అదే స్థాయిలో ‘ఉరిమే మనసే’..మరో విరహగీతంతో సంగీత ప్రియుల ముందుకు వచ్చేశాడు. నాని ద్విపాత్రాభినయంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్వకత్వంలో తెరకెక్కిన ‘కృష్ణార్జున యుద్ధం’ మూవీ నుండి మరో లిరికల్ సాంగ్ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఒక్కో సాంగ్ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఉరిమే మనసే’.. సాంగ్ను రఘ దీక్షిత్ ఆలపించగా.. శ్రీజో లిరిక్స్ అందించారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.
వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు హిప్హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఒక్కో సాంగ్ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఉరిమే మనసే’.. సాంగ్ను రఘ దీక్షిత్ ఆలపించగా.. శ్రీజో లిరిక్స్ అందించారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్న ‘కృష్ణార్జున యుద్ధం’ ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుంచాలని సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.