యాప్నగరం

కమ్ముల ఫుల్ ఖుషీ.. రూ.60 కోట్లు దాటిన ‘ఫిదా’!

డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ సినిమా తొలిసారి రూ. 50 కోట్ల మార్కును దాటింది.

TNN 6 Aug 2017, 12:47 pm
డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఓ సినిమా తొలిసారి రూ. 50 కోట్ల మార్కును దాటింది. శేఖర్ కమ్ముల కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ‘ఫిదా’ నిలిచింది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథ ‘ఫిదా’. అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి మధ్య ప్రేమ నేపథ్యంలో సాగిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ. 34.8 కోట్లు.
Samayam Telugu varun tej and sai pallavis romantic entertainer fidaa grosses rs 60 crore globally
కమ్ముల ఫుల్ ఖుషీ.. రూ.60 కోట్లు దాటిన ‘ఫిదా’!


‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘అనామిక’ నిరాశపరచడంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ‘ఫిదా’ను తెరకెక్కించారు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా.. కమ్ముల టేకింగ్, భావేద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీనికి తోడు వరుణ్ తేజ్ ఇమేజ్, సాయి పల్లవి నటన సినిమా బాగా కలిసొచ్చాయి. అమెరికాలో కూడా ‘ఫిదా’ పరుగులు తీస్తోంది. జులై 21న విడుదలైన ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌‌కు చేరువలో ఉంది. సుమారు రూ. 16 కోట్ల బడ్జెట్‌తో దిల్ రాజు ‘ఫిదా’ను నిర్మించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.