ఏషియన్ సినిమాస్తో కలిసి సూపర్ స్టార్ మహేష్బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో అత్యంత సుందరమైన మల్టీప్లెక్స్గా నిలిచిన ఈ ఏఎంబీ సినిమాస్లో ‘ఎం లాంజ్’ అనే వీఐపీ లాంజ్ను ఏర్పాటు చేశారు. అంటే సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు ఈ లాంజ్లో జరుగుతాయి. ఇప్పుడు ఇదే లాంజ్లో ‘అంతరిక్షం’ ట్రైలర్ లాంచ్ జరిగింది.
See Photos: ‘అంతరిక్షం’ ట్రైలర్ లాంచ్
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరితో పాటు దర్శకుడు సంకల్ప్రెడ్డి, నిర్మాతలు క్రిష్ జాగర్లమూడి, రాజీవ్రెడ్డి, ఇతర నటులు పాల్గొన్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ను ఆవిష్కరించిన తరవాత ఒక థియేటర్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన క్రిష్ జాగర్లమూడి మాట్లాడుతూ.. ఈ సినిమా పట్టాలెక్కడానికి ప్రధాన కారణం వరుణ్ తేజ్ అని అన్నారు. ఒక వేళ వరుణ్ ఒప్పుకోకపోతే ఇంత మంచి సినిమా ప్రారంభమయ్యేది కాదన్నారు. ‘కంచె’, ‘అంతరిక్షం’ వంటి వైవిధ్యమైన సినిమాలను అంగీకరించి కొత్త టాలెంట్ను వరుణ్ ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.
See Photos: ‘అంతరిక్షం’ ట్రైలర్ లాంచ్
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరోహీరోయిన్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరితో పాటు దర్శకుడు సంకల్ప్రెడ్డి, నిర్మాతలు క్రిష్ జాగర్లమూడి, రాజీవ్రెడ్డి, ఇతర నటులు పాల్గొన్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ట్రైలర్ను ఆవిష్కరించిన తరవాత ఒక థియేటర్లో మీడియా సమావేశం నిర్వహించారు.