వరుణ్ తేజ్ ఈసారి ప్రేమకథతో కాదు.. స్పేస్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పూర్తిగా అంతరిక్షం (స్పేస్) నేపథ్యంలో సాగే ఈ సినిమాలో స్టంట్స్ కోసం వేసిన సెట్ ఈ సినిమాకే ప్రత్యేకం. టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి సెట్ వేయడం ఇదే తొలిసారి. అంతరిక్షాన్ని తలపించేలా.. గురుత్వాకర్షణ లేని ‘జీరో గ్రావిటీ’ సెట్ను ఏర్పాటుచేశారు.
అంటే ఇందులో అడుగుపెడితే.. అంతరిక్షంలోకి వెళ్లినట్లే ఉంటుంది. హాలీవుడ్ టెక్నీషియన్ల ఆధ్వర్యంలో అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్తో పాటు ఇతర తారాగణంపై కూడా పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ ‘జీరో గ్రావిటీ’ సెట్లో.. ఎలాంటి గురుత్వాకర్షణ ఉండదని, అంటే అందులో అడుపెడితే గాల్లో తేలవచ్చని చెబుతున్నారు.
ఈ సెట్లో చిత్రించిన హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీల సన్నివేశాలను 3డీ స్కాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండరు. సెట్ను కూడా పూర్తిగా తీసేస్తారు. ఏదైనా సన్నివేశం మిస్సయితే.. 3డీ స్కాన్ సాయంతో సీజీ (గ్రాఫిక్స్)లో మళ్లీ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించవచ్చు’’ అని తెలిపారు.
తొలి సినిమా ‘ఘాజీ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మరో కథనాయికగా కనిపించనుంది. ఈ సినిమాకు ‘అహం బ్రహ్మస్మీ’, ‘వ్యోమగామి’ టైటిళ్లను పరిశీలిస్తున్నారు.
అంటే ఇందులో అడుగుపెడితే.. అంతరిక్షంలోకి వెళ్లినట్లే ఉంటుంది. హాలీవుడ్ టెక్నీషియన్ల ఆధ్వర్యంలో అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలను ఈ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్తో పాటు ఇతర తారాగణంపై కూడా పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ ‘జీరో గ్రావిటీ’ సెట్లో.. ఎలాంటి గురుత్వాకర్షణ ఉండదని, అంటే అందులో అడుపెడితే గాల్లో తేలవచ్చని చెబుతున్నారు.
ఈ సెట్లో చిత్రించిన హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అదితి రావ్ హైదరీల సన్నివేశాలను 3డీ స్కాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ తర్వాత హాలీవుడ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉండరు. సెట్ను కూడా పూర్తిగా తీసేస్తారు. ఏదైనా సన్నివేశం మిస్సయితే.. 3డీ స్కాన్ సాయంతో సీజీ (గ్రాఫిక్స్)లో మళ్లీ ఆ సన్నివేశాన్ని చిత్రీకరించవచ్చు’’ అని తెలిపారు.
తొలి సినిమా ‘ఘాజీ’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మరో కథనాయికగా కనిపించనుంది. ఈ సినిమాకు ‘అహం బ్రహ్మస్మీ’, ‘వ్యోమగామి’ టైటిళ్లను పరిశీలిస్తున్నారు.