యాప్నగరం

‘వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు’ విడుద‌ల‌ తేదీ ఖరారు

త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ట్రైలర్ తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

Samayam Telugu 5 Oct 2018, 5:11 pm
నారా రోహిత్, శ్రీయా సరన్, సుధీర్‌బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వీరభోగ వంసతరాయలు’. ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రసేన తెరకెక్కించారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెల్లానా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. చిత్రంపై వారికి ఆసక్తి పెరిగింది. అయితే ప్రేక్షకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు. అక్టోబర్ 26న ప్రపంచవ్యాప్తంగా ‘వీరభోగ వసంతరాయలు’ను ఘనంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
Samayam Telugu Rohit


ఇదిలా ఉంటే, త్వరలోనే ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే ట్రైలర్ తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగే భిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ ‘వీరభోగ వసంతరాయలు’ అని నిర్మాత వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూర్చారు. ఎస్.వెంక‌ట్, నవీన్ యాదవ్ సినిమాటోగ్రఫీ అందించారు. శశాంకర్ మాలి ఎడిటర్‌గా పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.