యాప్నగరం

దాసరి మరణం తీరని లోటు- వెంకయ్యనాయుడు

ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

TNN 30 May 2017, 8:24 pm
ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.
Samayam Telugu venkaiah naidu express deep condolence on dasari narayana rao death
దాసరి మరణం తీరని లోటు- వెంకయ్యనాయుడు


దాసరి నారాయణ రావు మరణ వార్త చాలా బాధ కలిగించిందని.. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దన్నను కోల్పోయిందన్నారు. ఆయన దర్శకుడు, నటుడు , నిర్మాతగానే కాకుండా రాజకీయంగానూ తనకంటూ ప్రత్యేకమైన స్థాయిని సంపాదించారని.. కేంద్రమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది నటీనటులు ఆయన దగ్గరే ఓనమాలు నేర్చుకున్నారని చాలా మంది నటులకు నటన నేర్పించారిని.. 150 పైగా సినిమాలకు దర్శకత్వం చేయడం ఆయనకు మాత్రమే సాధ్యం అయ్యిందని అన్నారు.

ఆయనతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఉందని.. ఆయన మరణం తీరనిలోటని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతున్నానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.