యాప్నగరం

‘ట్రైనింగ్ తీసుకున్నామ్.. మాకు ఒలింపిక్స్‌లో ఛాన్స్ దొరుకుతుందా’.. యాక్టర్ల రిక్వెస్ట్

ఇప్పుడు ఎక్కడ చూసిన టోక్యోలో జరిగే ‘ఒలింపిక్స్’ గురించే చర్చ జరుగుతోంది. భారత్‌తో పాటు.. ఇతర దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఇప్పటికే టోక్యో చేరిపోయారు. అయితే తాజాగా ఓ ఇద్దరు టాలీవుడ్ నటులకు ఈ ఒలింపిక్స్‌లోకి ఎంట్రీ కావాలట.

Samayam Telugu 19 Jul 2021, 9:50 pm
ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘ఒలింపిక్స్’ క్రీడల గురించే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నమెంట్ ఈసారి టోక్యోలో జరుగుతోంది. నిజానికి ఈ టోర్నమెంట్ గత ఏడాదే జరగాల్సింది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దాన్ని వాయిదా వేసి.. ఈ ఏడాది జరుపుతున్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదించిన క్రీడాకారులు అందరూ టోక్యోకి చేరుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. కట్టుదిట్టమైన భద్రత నడుమ జూలై 23వ తేదీ నుంచి ఈ క్రీడా సమరం ప్రారంభం కానుంది.
Samayam Telugu వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్
Vennela Kishore And Rahul Ravindran


అయితే ఓ ఇద్దరు మాత్రం ఒలంపిక్స్‌లోకి లేట్ ఎంట్రీ కోరుతున్నారు. అయితే వాళ్లిద్దరు క్రీడాకారులు కాదు.. నటులు. అదేంటి నటులు ఒలంపిక్స్‌లోకి ఎంట్రీ కోరడం ఏంటని అనుకుంటున్నారు. అది నిజంగా కాదండి.. ఊరికే సరదాకి. ప్రముఖ హాస్యనటుడు ‘వెన్నెల’ కిషోర్ సినిమాలో ఏ రేంజ్‌లో కామెడీ చేస్తారో సోషల్‌మీడియాలో కూడా అదే రేంజ్‌లో వినోదాన్ని పంచుతారు. ఆయన చేసే పోస్టులు చాలా సరదాగా ఉంటాయి. ఆయన పోస్టులకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఇక ఇండస్ట్రీలో ఆయన, నటుడు రాహుల్ రవీంద్రన్, అడివి శేష్‌లు బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకరి గురించ మరొకరు తరచూ కామెడీగా పోస్ట్‌లు చేస్తుంటారు.

తాజాగా రాహుల్ కూడా అచ్చం అలాంటి పోస్టే చేశారు. కిషోర్ కలిసి ఓ స్టేడియంలో బాగా ఆడి ఆయన చెమటోడ్చారు. ఆ తర్వాత దిగిన పిక్‌ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ‘‘సార్.. మేము ఎంతో కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నాం.. చివరి నిమిషంలో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఏమైనా లభిస్తుందా..’’ అంటూ రాహుల్ రవీందర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ‘ఇస్తావా? లేదా?’ అన్నట్లు వెన్నలకిషోర్ ఎక్స్‌ప్రెషన్ ఉందంటూ ఆయన రాసుకొచ్చారు. దీనిపై అభిమానులతో పాటు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘పిలిస్తే వచ్చే వాడిని’ అంటూ అడివి శేష్ కామెంట్ చేశాడు. ‘మీరు ఎక్కడ ఆడుతున్నారో.. నాకు చెప్పండి’ అంటూ దర్శకురాలు నందిని రెడ్డి పేర్కొన్నారు.
View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.