యాప్నగరం

రజినీతో సూపర్‌ హిట్ సినిమాలు తీసిన ఆ దర్శకుడు ఇకలేరు

జానీ, ముల్లు ముల్లారం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రజినీకాంత్‌‌కు తమిళ సూపర్‌స్టార్ హోదాకు కారణమైన సీనియర్ దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూశారు.

Samayam Telugu 2 Apr 2019, 12:19 pm
కోలీవుడ్‌కు చెందిన సీనియర్ దర్శకుడు జే మహేంద్రన్ (79) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మంగళవారం ఉదయం తన తండ్రి కన్నుమూసినట్టు ఆయన కుమారు జాన్ మహేంద్ర ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతోన్న ఆయనను గతవారమే చికిత్స కోసం ఆపోలో హాస్పిటల్‌లో చేర్పించగా, డయాలసిస్ అనంతరం ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందజేశారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
Samayam Telugu tamil-2

తమిళ చిత్ర పరిశ్రమలో రచయితగా సినీ ప్రస్థానం ప్రారంభించిన మహేంద్రన్ అనంతరం దర్శకుడిగా మారి మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక, ఈయన దర్శకత్వంలో వచ్చిన జానీ, ముల్లు ముల్లారం లాంటి సినిమాలతోనే రజినీకాంత్‌‌కు సూపర్‌స్టార్ హోదా వచ్చింది. నటుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల విడుదలైన రజినీ పేట, ఇళయ దళపతి విజయ్ థేరీ సినిమాల్లో చివరిసారిగా నటించారు. బీఓఎఫ్‌టీఏ ఫిల్మ్ స్కూల్‌లోని స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ విభాగాలకు అధిపతిగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.