యాప్నగరం

సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి కన్నుమూత

సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి ఇక లేరు.

Samayam Telugu 22 Jun 2016, 9:20 pm
సీనియర్ నటుడు జేవీ రమణ మూర్తి ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణమూర్తి బుధవారం రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 84 ఏళ్లు. 1933లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లుకులాం గ్రామంలో జన్మించిన ఆయన పూర్తి పేరు జొన్నలగడ్డ వెంకట రమణ మూర్తి. ప్రముఖ నటులు జేవీ సోమయాజులుకి సోదరుడైన రమణమూర్తి.. 1957లో ఎమ్మెల్యే అనే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. అనంతరం దాదాపు 150 చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటిస్తూనే నాటకరంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. గోరింటాకు, గుప్పెడు మనసు, మరో చరిత్ర, ఆకలి రాజ్యం, సిరిసిరి మువ్వ, బాటసారి, మాంగల్యబలం, సప్తపది, శుభలేఖ వంటి సినిమాలు ఆయనకి నటుడిగా బాగా గుర్తింపు తెచ్చిన చిత్రాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.