యాప్నగరం

ప్రముఖ నిర్మాత, ప్రతాప్‌ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ కన్నుమూత

ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు.

Samayam Telugu 31 Jul 2018, 7:32 am
Samayam Telugu K Raghva
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ (105) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కోల్‌కతాలోని ఓ స్టూడియోలో ట్రాలీ పుల్లర్‌గా జీవితం ప్రారంభించిన ఆయన.. జీవితంలో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను ప్రారంభించారు. ఆ బ్యానర్‌లో ఎన్నో సినిమాలను ఆయన నిర్మించారు. తాతామనవడు,ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,సంసారం సాగరం,జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, జగత్ జంత్రీలు, వంటి సినిమాలను నిర్మాతగా వ్యవహరించారు.

దర్శక రత్న దాసరితో పాటూ ఎంతోమంది నటుల్ని తెలుగు ఇండస్ట్రీకి ఈయనే పరిచయం చేశారు. అంతేకాదు ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. 1972లో తాతమనవడు.. 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు వచ్చింది. కె.రాఘవ మృతిపై టాలీవుడ్‌తో పాటూ పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.