యాప్నగరం

200 కోట్లు చాలా తక్కువన్న విజయ్ దేవరకొండ.. నేరుగా అదే మాట! సినీ వర్గాల్లో హాట్ టాపిక్

'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ తర్వాత అదే జోష్‌లో 'లైగర్' సినిమా రూపొందిస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవుతుండటంతో ఓటీటీ దిశగా ఆలోచనలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్ దేవరకొండ రియాక్ట్ అయ్యారు.

Samayam Telugu 22 Jun 2021, 3:23 pm

ప్రధానాంశాలు:

  • ఓటీటీలో 'లైగర్' మూవీ
  • భారీ ఆఫర్‌కి పూరి జగన్నాథ్ రెడీ
  • వెంటనే రియాక్ట్ అయిన విజయ్ దేవరకొండ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu 200 కోట్లు చాలా తక్కువన్న విజయ్ దేవరకొండ..
Vijay Deverakonda
రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'లైగర్'. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత అదే జోష్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం పైగా షూటింగ్ ఫినిష్ చేసిన పూరి.. చిత్ర అప్‌డేట్స్ బయటకు వదిలి సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేశారు. దీంతో ప్రతిఒక్కరి చూపు ఈ సినిమాపైనే పడింది. ఈ నేపథ్యంలో లైగర్ సినిమాను ఓటీటీ వేదికపై రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'లైగర్' చిత్రానికి ఓ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందని, పూరి జగన్నాథ్‌ ఆ దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ చిత్ర ఓటీటీ, శాటిలైట్‌, థియేట్రికల్‌ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతోందని.. ఏకంగా 200 కోట్ల భారీ మొత్తంతో అన్ని హక్కులు కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ రెడీగా ఉందనే న్యూస్ వైరల్ అయింది. పరిస్థితుల్ని బట్టి వచ్చే నెలలో పూరి జగన్నాథ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని అన్నారు.

ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చకచకా షూటింగ్ ఫినిష్ చేసేసి.. ఓటీటీలో అయినా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారని చెప్పుకున్నారు. దీంతో ఈ వార్తలపై నేరుగా రియాక్ట్ అయ్యారు హీరో విజయ్ దేవరకొండ. ''లైగర్ కోసం 200 కోట్లు చాలా తక్కువని, థియేటర్స్‌లో అంతకంటే ఎక్కువ రాబడతాం'' అని పేర్కొంటూ ట్వీట్ పెట్టారు. అంటే ఈ మూవీపై రౌడీ స్టార్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవవచ్చు.
Sekhar Kammula: ధనుష్‌‌తో సాయి పల్లవి రొమాన్స్.. అదే మ్యాజిక్ రిపీట్ చేయబోతున్న డైరెక్టర్!
వచ్చే నెల నుంచి హైదరాబాద్‌లో ఈ చిత్ర కొత్త షెడ్యూల్‌ మొదలు పెట్టనున్నారట. పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌, కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌‌గా నటిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.