యాప్నగరం

‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్: దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రం ఎండిపోయిందంట!

ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ, రష్మికా మందన విడుదల చేశారు.

Samayam Telugu 10 Nov 2020, 9:19 pm
‘దొరసాని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న రెండో చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఫ్యామిలీ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. అయితే, చిత్ర ప్రచారంలో భాగంగా ఈరోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఆవిష్కరించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా మంచి ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది.
Samayam Telugu ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్
Middle Class Melodies Trailer


తండ్రికి ఎప్పుడూ నష్టం చేకూరుస్తూ ఆయనతో తిట్లు తినే కొడుకు పాత్రలో ఆనంద్ దేవరకొండ నటించారు. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందింది. అంటే, గుంటూరు యాసలో ఈ సినిమా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన గుంటూరు పాట విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ట్రైలర్ కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర చాలా అట్రాక్టివ్‌గా ఉంది. అలాగే డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘‘దరిద్రుడు దొడ్డికెళ్తే సముద్రం ఎండిపోయిందంట’’ అనే డైలాగు హీరో తండ్రి పాత్రలోని ఫస్ట్రేషన్‌‌కి, సినిమాలో ఉన్న కామెడీ డోస్‌కి అద్దం పడుతోంది.

Also Read: పుట్టినరోజు నాడు పవన్ కళ్యాణ్‌ను కలిసిన డైరెక్టర్ క్రిష్

కాగా, వినోద్ అనంతోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. జనార్ధన్ పసుమర్తి కథ, మాటలు అందించారు. స్వీకర్ అగస్తి స్వరాలు సమకూర్చారు. ఆర్‌హెచ్ విక్రమ్ నేపథ్య సంగీతం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫి అందించారు. రవితేజ గిరిజాల ఎడిటర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.