యాప్నగరం

యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లైగర్.. రిలీజ్‌పై పూరి జగన్నాథ్ ఫైనల్ డిసీజన్!

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న 'లైగర్' మూవీ చకచకా కంప్లీట్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. తాజాగా ఈ మూవీ యూఎస్ షెడ్యూల్ పూర్తయిందని తెలుస్తోంది. అతిత్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

Samayam Telugu 26 Nov 2021, 11:42 am
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న సినిమా 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్ లైన్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. గత ఏడాదికి పైగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్న పూరి.. ఇప్పుడు మరో షెడ్యూల్ ఫినిష్ చేసి రిలీజ్ డేట్ కోసం వెతుకులాట షురూ చేశారట.
Samayam Telugu యూఎస్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లైగర్
Liger


లైగర్ సినిమాలోని ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ కోసం రీసెంట్‌గా యూఎస్ వెళ్లిన చిత్రబృందం తాజాగా ఆ షెడ్యూల్ అంతా కంప్లీట్ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ - హీరో విజయ్ దేవరకొండలపై ఫైట్ సీక్వెన్స్, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగిందని తెలుస్తోంది. చిత్ర సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా ఉండేలా శ్రద్ద తీసుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదట. ప్రతి సీన్ కోసం చిత్ర బృందాన్ని ఎంతో కష్టపెట్టి కావాల్సిన అవుట్‌పుట్ రాబట్టారని టాక్.
Anchor Anasuya: ప్రభుదేవాతో అనసూయ ఫ్లాష్‌ బ్యాక్.. జబర్దస్త్ యాంకర్ మరో యాంగిల్!!
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహార్‌లు దర్మ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ బాక్సింగ్‌లో‌ శిక్షణ కూడా తీసుకున్నారు. ఇంతవరకు ఓకే గానీ చిత్ర విడుదల విషయంలో ఆలస్యం అవుతుండటంతో పూరి ఓ నిర్ణయానికి వచ్చేశారని తెలుస్తోంది. 2022 ప్రారంభంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని ఆయన ఫిక్సయ్యారట. అతిత్వరలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.