యాప్నగరం

పవన్ ఒడిలో అకీరా, ఆధ్య.. అరుదైన క్షణం అంటూ ఫొటో షేర్ చేసిన రేణు దేశాయ్

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ను మరోసారి గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, తన పిల్లలతో పవన్ కళ్యాణ్ ఉన్న ఒక అందమైన ఫొటోను షేర్ చేశారు.

Samayam Telugu 2 Dec 2020, 9:09 pm
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో షేర్ చేసే కొన్ని ఫొటోలు తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి. దానికి చాలా కారణాలే ఉండొచ్చు. ఆ ఫొటోలోని పాజిటివ్, నెగిటివ్ అంశాలు.. ఆ ఫొటోను షేర్ చేసిన వ్యక్తి.. ఇవన్నీ ఆ ఫొటో వైరల్ అవడానికి కారణాలు అవుతాయి. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫొటో కూడా ఇలానే వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆ ఫొటో రేణు దేశాయ్ మాజీ భర్త పవన్ కళ్యాణ్‌ది కావడమే.
Samayam Telugu రేణు దేశాయ్ షేర్ చేసిన ఫొటో
Renu Desai


పవన్ కళ్యాణ్ తన పిల్లలు అకీరా, ఆద్యతో ఉన్న ఒక అందమైన ఫొటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది పాత ఫొటో. పవన్ కళ్యాణ్ గుండెలపై అకీరా, ఆద్య తలపెట్టి నిద్రపోతున్నట్టు ఈ ఫొటోలో కనిపిస్తోంది. దీన్ని అరుదైన క్షణంగా రేణు దేశాయ్ అభివర్ణించారు. ‘‘కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసుకోవాలి. అవి కేవలం మీ ఫోన్‌లో ఫొటో ఆల్బమ్‌లో ఉండిపోకూడదు. కొన్ని అరుదైన క్షణాలను నా ఫోన్ కెమెరాతో నేను స్వయంగా క్యాప్చర్ చేశాను’’ అని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
View this post on Instagram A post shared by renu desai (@renuudesai)
అంటే, ఈ ఫొటో తన ఫోన్ కెమెరాతో స్వయంగా రేణు దేశాయ్ తీసిన ఫొటో. ఈ అందమైన ఫొటోను షేర్ చేయకుండా రేణు దేశాయ్ ఉండలేకపోయారు. ఈ పాయింట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. అందుకే వారు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లిచేసుకున్న రేణు దేశాయ్.. 2012లో ఆయన నుంచి విడిపోయారు. ఆ తరవాత తన పిల్లలిద్దరితో కలిసి స్వస్థలం పుణే వెళ్లిపోయారు. అక్కడ మరాఠి సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే, మరాఠి సినిమాలను నిర్మించారు. ఇప్పుడు తెలుగులో ఒక సినిమా చేస్తున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.