యాప్నగరం

యుద్ధ పిపాసులను సరిహద్దులకు పంపాలి

యుద్ధ పిపాసులు, యుద్ధం కోసం ఆజ్ఞలు జారీ చేసేవారిని సరిహద్దులకు పంపితే అసలు సంగతి తెలుస్తుందని బాలీవుడ్

Samayam Telugu 14 Jun 2017, 4:04 pm
యుద్ధ పిపాసులు, యుద్ధం కోసం ఆజ్ఞలు జారీ చేసేవారిని సరిహద్దులకు పంపితే అసలు సంగతి తెలుస్తుందని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. యుద్దన్మోదులను శత్రువుతో పోరాడే సమయంలో ముందు వరుసలో నిలబెట్టి ‘మీరు ముందు యుద్ధం చేయండని చెప్పాలి. వాళ్ల కాళ్లు, చేతులు వణుకుతాయి. ఒకే రోజులో యుద్ధం ముగుస్తుంది. అప్పుడు చర్చల ద్వారా పరిష్కారానికి పూనుకుంటారు’ అని సల్మాన్ చెప్పారు.
Samayam Telugu war mongers should be sent to borders advises salman khan
యుద్ధ పిపాసులను సరిహద్దులకు పంపాలి


యుద్ధం అనేది ఒక దేశాన్ని మాత్రమే ప్రభావితం చేయదని, దాని వల్ల ఇరు దేశాల ప్రజలు చనిపోతారని సల్మాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

1962లో ఇండో-చైనా యుద్ధం నేపథ్యంలో చిత్రీకరించిన సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ‘ట్యూబ్ లైట్’ ప్రమోషన్ లో భాగంగా ముంబైలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సల్మాన్ యుద్ధంపై పలు వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.