యాప్నగరం

ప్రాణం తీస్తే పరువెక్కడుంది : రామ్‌చరణ్

ప్రేమకు హద్దులు లేవు అని, ప్రణయ్‌కు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samayam Telugu 18 Sep 2018, 7:39 pm
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరువు హత్యపై మెగా హీరో రామ్ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పరువు హత్య నన్ను తీవ్రంగా కలచి వేసింది. పరువు హత్య అంటున్నారు. ఓ వ్యక్తి ప్రాణం తీస్తే పరువు ఎక్కడ ఉంటుంది?. అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తోంది. బాధితురాలు అమృత వర్షిణికి, ప్రణయ్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని రామ్ చరణ్‌ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.
Samayam Telugu Ram Charan On Pranay Murder


ప్రేమకు హద్దులు లేవు (#Lovehasnoboundaries), ప్రణయ్‌కు న్యాయం జరగాలి (#justiceforpranay) అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా చెర్రీ తన పోస్ట్‌లో జత చేశారు. చెర్రీ పోస్టుకు విశేష స్పందన వస్తోంది. భర్త రామ్ చరణ్ పోస్టుపై ఉపాసన స్పందించారు. ‘బాధాకరమైన స్థితి. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామంటూ’ ప్రశ్నిస్తూ చరణ్ పోస్టును స్క్రీన్ షాట్ తీసి ఆమె ట్వీట్ చేశారు. ప్రేమకు హద్దులు లేవు, ప్రణయ్‌కు న్యాయం జరగాలి అనే హ్యాష్ ట్యాగ్స్‌ పోస్ట్ చేశారు.

కాగా, ప్రణయ్ హత్యపై ఇదివరకే మంచు మనోజ్, రామ్, చిన్మయి శ్రీపాద, తదితర ఆర్టిస్టులు తీవ్రంగా స్పందించారు. ఈ కాలంలోనూ పరువు హత్యలు, కులం హత్యలు ఏంటివని వాళ్లు ప్రశ్నించారు. తాజాగా రామ్ చరణ్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అమృత క్రియేట్ చేసిన ‘జస్టిస్‌ ఫర్‌ ప్రణయ్‌’ఫేస్‌బుక్ పేజీకి భారీ ఎత్తున మద్దు లభిస్తోంది. ప్రణయ్‌కు న్యాయం జరగాలని, నిందితులను ఉరిశిక్ష విధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.