యాప్నగరం

బుల్లితెర మహిళా శిరోమణి అవార్డులు

తెలుగు టెలివిజన్ రచయితల సంఘం బుల్లితెర మహిళా శిరోమణి అవార్డులు ప్రదానం చేసింది.

TNN 8 Mar 2016, 6:41 pm
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు టెలివిజన్ రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలకు తెలుగు టెలివిజన్ రచయితల సంఘం బుల్లితెర మహిళా శిరోమణి అవార్డులు ప్రదానం చేసింది. ఈ కార్యక్రమం ఫిలింఛాంబర్ లో జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారు కెవి.రమణాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. 20 మంది మహిళలకు పురస్కారాలు అందచేశారు.
Samayam Telugu womans day awards to tv actors
బుల్లితెర మహిళా శిరోమణి అవార్డులు


రచయిత్రులు కందాల ఉషారాణి, బలభద్రపాత్రుని రమణి, అయినంపూడి శ్రీలక్ష్మీ, బాల త్రిపురసుందరి, రాధా ప్రశాంతి, నటీమణులు రాగిణి, నవీన యాటా, రాధికా ప్రశాంతి, శృతి, నిర్మాత కొడాలి అనిత, రిజ్వానా మహతి, న్యూస్ రీడర్లు దేసాయి శ్రీదేవి, దీప్తి వాజ్ పాయ్, నెల్లుట్ల కవిత, చిత్రలేఖ, మంగ్లి సత్యవతి, తీన్ మార్ సావిత్రి కె.శివజ్యోతి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సన్మానించారు. ​

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.