యాప్నగరం

YS Jagan: ‘నువ్ అనుకో జగన్ సామీ అయిపోద్ది’.. అసెంబ్లీలో పద్మావతి డైలాగ్ పేలిందిగా‌

‘నువ్ అనుకోసామీ.. అయిపోద్ది’.. ఈ డైలాగ్ వింటే మాటల మాంత్రికుడు డైరెక్షన్‌లో వచ్చిన ఖలేజా సినిమా గుర్తుకువస్తోంది. మహేష్ బాబు నటించిన ఈ చిత్రంలోని ఫేమస్ డైలాగ్‌ ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో దద్దరిల్లుతోంది.

Samayam Telugu 23 Jan 2020, 3:38 pm
ఒకవైపు ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంచాలని రాజధాని ప్రాంత రైతులు.. మరోవైపు మూడు రాజధానులు ఉండాలని మిగిలిన ప్రాంతాల వారు నినాదాలతో హోరెత్తుతుంటే.. అసెంబ్లీలో మాత్రం సినిమా డైలాగ్‌లు పేలుతున్నాయి.
Samayam Telugu Jonnalagadda Padmavathy
జొన్నలగడ్డ పద్మావతి


అధినేతను ప్రసన్నం చేసుకోవడంలో భాగంగా.. నేతలు తమ పొగడ్తలతో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. అప్పట్లో సినీ నటి రోజు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అరవింద సమేత’లోని టార్చ్ బేరర్‌ డైలాగ్‌ను జగన్‌కి అన్వయించి అదరగొట్టగా.. రీసెంట్‌గా మంత్రి పుష్ఫశ్రీవాణి ‘రామసక్కని సీత’ సీరియల్‌లోని బియ్యం పాయసం డైలాగ్‌తో ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించారు.

Read Also: అసెంబ్లీలో ‘రామ సక్కని సీత’.. మేడమ్ సీరియల్స్ బాగా చూస్తారే అంటూ..

ఇక గురువారం నాడు ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీ చర్చలో భాగంగా మాట్లాడిన శింగనమల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. జగన్‌ను మహేష్ బాబుని చేసేశారు. ‘ఖలేజా’ సినిమాలోని నువ్ అనుకో సామీ అయిపోద్ది డైలాగ్‌ను జగన్‌కు అన్వయిస్తూ ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని’ తెలియజేస్తూ.. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం. నీ మాట శాసనం’ అంటూ త్రివిక్రమ్ డైలాగ్‌ను గుర్తు చేశారు.

ఇక ప్రతిపక్షనాయకుడు చంద్రబాబుపై విమర్శల్లోని సూపర్ మహేష్ బాబు డైలాగ్‌ను వాడేశారు. చంద్రబాబుకు అమరావతి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని.. ఆయన డ్రామాలు ‘నెవ్వర్ బిఫోర్‌.. ఎవ్వర్ ఆఫ్టర్‌’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని పాపులర్ డైలాగ్‌ను గుర్తు చూసి ఛలోక్తులు విసిరారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.