యాప్నగరం

రోజా పంచ్: ‘నారావారి నరకాసుర నామ సంవత్సరం-2017’

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి మరోసారి మాటల తూటాలు పేల్చుతూ తెలుగు పార్టీ వర్గాల్లో మంటలు పుట్టించారు. 2017 సంవత్సరాన్ని ‘నారావారి నరకాసుర నామ సంవత్సరం’గా అభివర్ణిస్తూ చంద్రబాబు పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

TNN 30 Dec 2017, 7:03 pm
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి మరోసారి మాటల తూటాలు పేల్చుతూ తెలుగు పార్టీ వర్గాల్లో మంటలు పుట్టించారు. 2017 సంవత్సరాన్ని ‘నారావారి నరకాసుర నామ సంవత్సరం’గా అభివర్ణిస్తూ చంద్రబాబు పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం అబద్ధాలు, ఆరాచకాలు, అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, అబద్ధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిందని విమర్శలు గుప్పించారు.
Samayam Telugu ycp mla roja fires on ap government and chandrababu
రోజా పంచ్: ‘నారావారి నరకాసుర నామ సంవత్సరం-2017’


అధికారం చేపట్టి నాలుగేళ్లైనా ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పులేదని.. అవే అబద్ధాలు, అవే కుట్ర పూరిత రాజకీయాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారన్నారు. టీడీపీలో రౌడీలు గుండాలే రాజ్యమేలుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు అంటే మన ముఖ్యమంత్రి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

ఆంగ్ల సంవత్సరం మనకొద్దని, గుడిలకు అలంకరణలు వద్దంటూ జీవో పాస్ చేసిన చంద్రబాబు.. కొత్త సంవత్సరంలో అర్థరాత్రి దాటినా మద్యం అమ్మకాలను సాగించమని చెప్పడం సిగ్గుచేటన్నారు. గుడులు కళకళలాడకుండా చేసి వైన్ షాపులను కళకళలాడిస్తున్నారంటూ సెటైర్లు వేస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ​చంద్రబాబుకి ఒళ్లు నిండా జబ్బులే.. అందుకే ట్యాంకర్‌లతో నీళ్లు చల్లుకుని రోడ్లపై నడుస్తాడంటూ వ్యక్తిగత ఆరోపణలకు దిగారు రోజా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.