యాప్నగరం

పుట్టినరోజున ఏసుదాసు గాన కచేరి

ప్రముఖ గాయకుడు జె. ఏసుదాసు చాలా నిరాడంబర జీవనాన్ని గడుపుతుంటారు.

TNN 11 Jan 2017, 5:32 pm
ప్రముఖ గాయకుడు జె. ఏసుదాసు చాలా నిరాడంబర జీవనాన్ని గడుపుతుంటారు. వివాదాలకు దూరంగా ఉంటూ, సంగీతంలో తొలి అడుగులు వేస్తున్నవారికి ఓ స్ఫూర్తిగా నిలిచిన ఏసుదాసు మంగళవారం 77వ ఏట అడుగుపెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఎప్పటిలాగే కర్ణాటకలోని కొల్లూ‌ర్‌లో ఉన్న మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు, చందిక హోమం నిర్వహించారు.
Samayam Telugu yesudas celebrated his 77th birthday in kollur temple
పుట్టినరోజున ఏసుదాసు గాన కచేరి


సోమవారం సాయంత్రం కొల్లూర్ చేరుకున్న ఏసుదాసు మంగళవారం ఉదయం ఆలయంలో పూజలు చేసారు. అనంతరం మరో గాయకుడు కన్హంగడ్ రామచంద్రన్‌తో కలసి కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుదాసుతో కలసి సెల్ఫీలు దిగేందుకు ఆయన అభిమానులు ప్రయత్నించారు. అయితే దీనిపై ఏసుదాసు తనదైన శైలిలో చాలా సున్నితంగా స్పందించారు. సెల్ఫీలకు దూరంగా ఉండాలని, మొబైల్ ఫోన్ల ఉపయోగాన్ని తగ్గించుకోవాలని అభిమానులకు సూచించారు. ఆలయంలో ఉన్న అమ్మవారి కన్నా పెద్ద కెమెరాలు లేవని అన్నారు. ఇలాంటి చర్యలను పక్కన పెట్టి ఆధ్యాత్మికతను పెంపొందిచుకోవాలని అభిమానులకు సూచించారు. ఈ సందర్భంగా ఆలయ పెద్దలు ఏసుదాసుని సత్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.