యాప్నగరం

హైదరాబాద్‌లో ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌.. పోస్టర్ ఆవిష్కరించిన కేటీఆర్

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లోని తన హిట్‌ పాటలను ఈ లైవ్‌ కాన్సర్ట్‌లో ఏసుదాస్‌ ఆలపించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌ జరగలేదు.

Samayam Telugu 3 Oct 2018, 7:08 pm
ఐదు దశాబ్దాలుగా తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడిస్తోన్న గాన కోవిదుడు కె.జె.ఏసుదాస్‌. ఇప్పటి వరకు ఎన్నో ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో, మన తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్‌ 11న లైవ్‌ కాన్సర్ట్‌ (సంగీత కచేరి) చేయబోతున్నారు. గతంలో మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రముఖ హీరోయిన్‌, నృత్యకారిణి శోభనతో ప్రదర్శనలు నిర్వహించిన ‘లెవెన్ పాయింట్ టు’ సంస్థ ఏసుదాస్‌ సంగీత సభను నిర్వహిస్తోంది.
Samayam Telugu JYesudas

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లోని తన హిట్‌ పాటలను ఈ లైవ్‌ కాన్సర్ట్‌లో ఏసుదాస్‌ ఆలపించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్‌ లైవ్‌ కాన్సర్ట్‌ జరగలేదు. తొలిసారి ఇలాంటి సంగీత వేడుక ఏసుదాస్‌ ఆధ్వర్యంలో జరగనుండటం ఆయన అభిమానులకే కాదు.. సంగీతాన్ని ప్రేమించే అందరికీ పండగే అని చెప్పవచ్చు. ఏసుదాస్‌తో పాటు ఆయన తనయుడు, ప్రముఖ గాయకుడు విజయ్‌ ఏసుదాస్‌ కూడా ఈ లైవ్‌ కాన్సర్ట్‌లో పాల్గొనబోతుండటం విశేషం.
ఈ లైవ్‌ కాన్సర్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కె.తారక రామారావు బుధవారం విడుదల చేశారు. నవంబర్‌ 11న రాత్రి ఏడు గంటలకు ఈ సంగీత సభ ప్రారంభమవుతుంది. ఈ కాన్సెర్ట్ టికెట్‌ ధర రూ.1200. బుక్ మై షో యాప్‌లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.