సాహో విజయం సాధించింది మీ వల్లే అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టి ఊరుకున్నారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. విజయోత్సవ వేడుకల్లాంటివి ఏవైనా నిర్వహించడం లాంటివి కూడా చేయలేదు. అయితే ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్లో తాను నటించిన సాహో సినిమాను వీక్షించారు. దాంతో సర్ప్రైజ్ అవ్వడం అభిమానుల వంతైంది. మధ్యాహ్నం 12 గంటల షో చూడటానికి ప్రభాస్ గచ్చిబౌలిలో ఉన్న ఏఎంబీ థియేటర్స్కు వెళ్లారు. ఎలాంటి హంగామా లేకుండా పార్కింగ్ స్థలం నుంచి వీఐపీ లిఫ్ట్లో థియేటర్ లోపలికి వెళ్లిపోయారట. ప్రభాస్ ఏఎంబీ థియేటర్కు రాబతున్నారన్న విషయం పలు ఫ్యాన్స్ అసోసియేషన్స్కు తెలిసిపోయింది.
అయితే అనవసరంగా గచ్చిబౌలి రూట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని ప్రభాస్ సన్నిహితులు అభిమానులను కోరారట. దాంతో ప్రభాస్ రాబోతున్నారన్న వార్తలు బయటికి రాకపోవడంతో థియేటర్ వద్ద ఎలాంటి హంగామా లేదు. ఈ థియేటర్లో ప్రభాస్ సినిమా చూడటం ఇదే మొదటిసారి. బహుశా మరోసారి తన సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లో చూసుకోవాలని ప్రభాస్కు అనిపించినట్లుంది.
మరోపక్క సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ను విడుదల చేసింది. ‘ఇంత కన్నా ఎక్కువ మీరు ఊహించగలరా’ అంటూ ట్వీట్ చేసింది. మరి విజయోత్సవ వేడుక గురించి ప్రభాస్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి. మరో విషయం ఏంటంటే దర్శకుడు సుజీత్ డెంగ్యూతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
దాంతో ఆయన ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిపై ఆయన సన్నిహితులు స్పందిస్తూ.. సుజీత్కు డెంగ్యూ కాదని ఫ్లూతో బాధపడుతున్నారని ్లక్లారిటీ ఇచ్చారు. బహుశా ఆయన పూర్తిగా కోలుకున్నాక సాహో విజయోత్సవ వేడుకను నిర్వహిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమా సక్సెస్ మాట ఎలా ఉన్నా 28 ఏళ్ల వయసులోనే సుజీత్ భారీ చిత్రాన్ని తన భుజాన వేసుకోవడం చిన్న విషయం కాదు.
అయితే అనవసరంగా గచ్చిబౌలి రూట్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయొద్దని ప్రభాస్ సన్నిహితులు అభిమానులను కోరారట. దాంతో ప్రభాస్ రాబోతున్నారన్న వార్తలు బయటికి రాకపోవడంతో థియేటర్ వద్ద ఎలాంటి హంగామా లేదు. ఈ థియేటర్లో ప్రభాస్ సినిమా చూడటం ఇదే మొదటిసారి. బహుశా మరోసారి తన సినిమాను మల్టీప్లెక్స్ థియేటర్లో చూసుకోవాలని ప్రభాస్కు అనిపించినట్లుంది.
మరోపక్క సుజీత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఒక పోస్టర్ను విడుదల చేసింది. ‘ఇంత కన్నా ఎక్కువ మీరు ఊహించగలరా’ అంటూ ట్వీట్ చేసింది. మరి విజయోత్సవ వేడుక గురించి ప్రభాస్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి. మరో విషయం ఏంటంటే దర్శకుడు సుజీత్ డెంగ్యూతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
దాంతో ఆయన ఓ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిపై ఆయన సన్నిహితులు స్పందిస్తూ.. సుజీత్కు డెంగ్యూ కాదని ఫ్లూతో బాధపడుతున్నారని ్లక్లారిటీ ఇచ్చారు. బహుశా ఆయన పూర్తిగా కోలుకున్నాక సాహో విజయోత్సవ వేడుకను నిర్వహిస్తారని టాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమా సక్సెస్ మాట ఎలా ఉన్నా 28 ఏళ్ల వయసులోనే సుజీత్ భారీ చిత్రాన్ని తన భుజాన వేసుకోవడం చిన్న విషయం కాదు.