యాప్నగరం

Yatra కొత్త రిలీజ్ డేట్.. పోటీ నుండి తప్పకున్నట్టే!

డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన చిత్ర యూనిట్ అనూహ్యంగా వెనకడుగు వేసింది.

Samayam Telugu 17 Dec 2018, 5:59 pm
దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ముందుగా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన చిత్ర యూనిట్ ఫిబ్రవరి 8కి వాయిదా వేసుకుంది. డిసెంబర్ 21న క్రిస్మస్‌ కానుకగా ‘పడి పడి లేచె మనసు’, ‘అంతరిక్షం’, ‘కేజీఎఫ్’ తదితర చిత్రాలు రిలీజ్‌కు రెడీ‌గా ఉండటంతో పోటీ నుండి తప్పుకుంది యాత్ర.
Samayam Telugu యాత్ర



ఈ చిత్రంలో వైఎస్సార్ పాత్రను మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి పోషించారు. మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎంతగానో దోహదపడిన రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రను ప్రధాన కథాంశంగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటిస్తుండగా.. వైఎస్ తండ్రి పాత్రలో జగపతిబాబు, కేవీపీగా రావు రమేష్, వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక, సూరీడు పాత్రలో పోసాని నటించనున్నట్టు తెలుస్తోంది. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా ఓ కీలకపాత్రలో కనువిందు చేయనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.