యాప్నగరం

కాస్త జాగ్రత్త దిల్ రాజూ.. దత్తపుత్రుడు రంకెలు వేస్తాడేమో..: వైసీపీ నేత

సినిమా థియేటర్స్‌లో టికెట్ ధరలు తగ్గించాలని యజమాన్యాలను కోరినట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అందరికీ అందుబాటులో రేట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు ఆయన తెలిపారు. దిల్ రాజు కామెంట్స్ వైసీపీ నేత స్పందిస్తూ.. పరోక్షంగా పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇచ్చారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 18 Aug 2022, 9:58 pm
ఇక నుంచి థియేటర్స్‌లో రిలీజ్ అయిన 8 వారాల తరువాతే సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అదేవిధంగా థియేటర్స్, మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలపై విషయంపై కూడా చర్చించామని.. రేట్లు తగ్గించాలని యాజమాన్యాలను కోరామని చెప్పారు. అందరికీ అందుబాటులో ధరలు ఉండేలా చూడాలని కోరినట్లు తెలిపారు. అదేవిధంగా పాప్‌కార్న్, తిను బండారాల రేట్లు కూడా కాస్త తగ్గించాలని అడిగామని ఇవాళ ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పారు.
Samayam Telugu దిల్ రాజు, దేవేందర్ రెడ్డి


తాజాగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత దేవేందర్ రెడ్డి గుర్రంపాటి స్పందించారు. 'కాస్త జాగ్రత్త దిల్ రాజూ.. నాపై కక్షతోనే దిల్ రాజు టికెట్ రేట్లను తగ్గిస్తున్నాడని దత్తపుత్రుడు రంకెలు వేస్తాడేమో..' అంటూ ట్వీట్ చేశారు. పరోక్షంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. గతంలో ఏపీ సినిమా టికెట్ ధరలపై తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌పై కక్షతో సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని జనసేన నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోతే.. తన సినిమాలను ఉచితంగా చూపిస్తానని పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్‌కు కౌంటర్‌గా దేవేందర్ రెడ్డి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దేవేందర్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నెగిటివ్ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.