Acharya: రామ్ చరణ్ కోసం 'ఆచార్య' టీమ్ స్కెచ్.. మెగా ఫ్యాన్స్ ఊగిపోయేలా ప్లాన్ రెడీ!
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య' మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఇందులో చెర్రీ కోసం ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చేశారట మేకర్స్.
Samayam Telugu 24 Jan 2021, 11:08 am
ఈ ఏడాది తెలుగు ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల లిస్టులో ముందు వరుసలో ఉంది 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా అప్డేట్స్ మెగా అభిమానుల్లో ఆతృతను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆచార్యకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు రావడంతో చిరంజీవి, రామ్ చరణ్ ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు.
చిరంజీవి కెరీర్లో 152వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీ నిర్మాణంలో భాగం పంచుకుంటూనే చిత్రంలో 'సిద్ద' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఆయన సెట్స్ పైకి వచ్చేశారని తెలిసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే రామ్ చరణ్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ కానుందని టాక్.
ఈ నేపథ్యంలో చెర్రీ కోసం పక్కాగా స్కెచ్చేసిన 'ఆచార్య' టీమ్ ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చేశారనేది లేటెస్ట్ సమాచారం. ఇందులో చెర్రీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని తెలుస్తుండటం మరింత అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మణిశర్మ ఈ సాంగ్ కూడా కంపోజ్ చేసి పెట్టారని, అతి త్వరలో కొరటాల ఈ సాంగ్ షూట్ ప్రారంభించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. ఇదే జరిగితే థియేటర్స్లో తండ్రీకొడుకుల హవా చూసి మెగా ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయమే అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ 'ఆచార్య' మూవీ టీజర్ సిద్ధం చేసిన చిత్రయూనిట్.. ఈ టీజర్ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు తెలిసింది. చిరంజీవి నక్సలైట్గా కనిపించనున్నారని తెలుస్తున్న నేపథ్యంలో ఈ టీజర్ కోసం మెగా అభిమానలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.
చిరంజీవి కెరీర్లో 152వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ మూవీ నిర్మాణంలో భాగం పంచుకుంటూనే చిత్రంలో 'సిద్ద' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే ఆయన సెట్స్ పైకి వచ్చేశారని తెలిసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఉండే రామ్ చరణ్ రోల్ సినిమాకు మేజర్ అసెట్ కానుందని టాక్.
ఈ నేపథ్యంలో చెర్రీ కోసం పక్కాగా స్కెచ్చేసిన 'ఆచార్య' టీమ్ ఓ డ్యూయట్ కూడా ప్లాన్ చేశారనేది లేటెస్ట్ సమాచారం. ఇందులో చెర్రీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుందని తెలుస్తుండటం మరింత అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మణిశర్మ ఈ సాంగ్ కూడా కంపోజ్ చేసి పెట్టారని, అతి త్వరలో కొరటాల ఈ సాంగ్ షూట్ ప్రారంభించబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. ఇదే జరిగితే థియేటర్స్లో తండ్రీకొడుకుల హవా చూసి మెగా ఫ్యాన్స్ ఊగిపోవడం ఖాయమే అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ 'ఆచార్య' మూవీ టీజర్ సిద్ధం చేసిన చిత్రయూనిట్.. ఈ టీజర్ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు తెలిసింది. చిరంజీవి నక్సలైట్గా కనిపించనున్నారని తెలుస్తున్న నేపథ్యంలో ఈ టీజర్ కోసం మెగా అభిమానలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.