యాప్నగరం

అల...వైకుంఠపురములో వాయిదా పడినట్లేనా?

అల్లు అర్జున్,త్రివిక్రమ్ ల కాబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల...వైకుంఠపరుములో.ముందుగా ఈ సినిమా టీజర్ ని దసరా కి రిలీజ్ చేస్తారు అని అన్నారు.కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు అని తెలుస్తుంది.

Samayam Telugu 17 Sep 2019, 9:17 pm
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,మ్యాజికల్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల...వైకుంఠపురములో.ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అని ముందు నుండి అంటున్నారు.అలాగే ఈ సినిమా టీమ్ రిలీజ్ చేస్తున్న ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ లో కూడా అదే మెన్షన్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి అల్లు అర్జున్ లుక్ ని పరిచయం చెయ్యడానికి అన్నట్టు ఒక చిన్న టీజర్ ని,ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.రాబోతున్న దసరాకి సినిమాలో అసలు కంటెంట్ ని పరిచయం చేస్తూ,సినిమా థీమ్ కి తగ్గట్టు ఒక కలర్ ఫుల్ టీజర్ ఒకటి ఇవ్వాలని,ఇస్తామని టీమ్ నుండి హింట్ వచ్చింది.కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం అల...వైకుంఠపురములో టీజర్ దసరాకి వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు.
Samayam Telugu Ala Vaikuntapuramulo
Ala Vaikuntapuramulo Movie Teaser Postponed


Also Read:
వెల్లువెత్తిన గోదారి..'వాల్మీకి'కి సూపర్ బజ్

ఇప్పటివరకు టీజర్ కటింగ్ కి సంబందించిన వర్క్ ఏదీ స్టార్ట్ కాలేదట.సినిమా షూటింగ్ ఆలస్యంగా సాగుతుండడంతో మళ్ళీ ఆ వర్క్ కూడ ఇప్పుడు పెట్టుకుంటే ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ ఫినిష్ అవ్వడం లేట్ అవుతుందని టీజర్ ని దసరాకి కాకుండా దీపావళికి ఇచ్చేలాప్లానింగ్ జరుగుతుందట.అరవింద సమేత సినిమాకి ముందే మొత్తం ట్యూన్స్ రెడీ చేసిపెట్టిన థమన్ ఈ సినిమాకి మాత్రం ఇంకా ఒక పాట ఇవ్వాల్సి ఉందట.ఆ పాట మీదే ఈ సినిమాలో కీలకమయిన ఇంటి సెట్ లో సాంగ్ ని షూట్ చెయ్యాల్సి ఉండడంతో మళ్ళీ ఇప్పుడు టీజర్ అంటే టైమ్ వేస్ట్ అయ్యి ఆ ప్రెజర్ కూడా పడుతుందని,అసలు దసరాకి టీజర్ అనే ఆలోచనని డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది.అరవింద సమేత సినిమాని అనుకుట్టుగానే అతి తక్కు టైమ్ లో ఫినిష్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాకి మాత్రం మళ్ళీ మామూలుగానే తన పంథాలో సాగుతున్నాడు.

Also Read: చుక్కల్లో సైరా రేట్లు..2.0 రికార్డ్ బ్రేక్

ఇక బన్నీ కూడా ఈసారి ప్రతి విషయాన్నీ స్వయంగా అబ్సర్వ్ చేస్తున్నాడు.ఎటూ గ్యాప్ వచ్చింది.దాన్ని ఒక బ్లాక్ బస్టర్ తో ఫిల్ చెయ్యాలి అనేది బన్నీ ఆలోచన.దాంట్లో ఎలాంటి తప్పు లేదు.కానీ ఇప్పటివరకు కేవలం 50 శాతం వరకు మాత్రమే షూటింగ్ పూర్తయింది.మరి సంక్రాంతి నాటికి ఈ సినిమా రిలీజ్ చెయ్యగలరా? అనే డౌట్ కూడా సినిమా వర్గాల్లో ఉన్నట్టు భోగట్టా.అందుకే అవన్నీ కూడా ఒక్కసారి చెక్ చేసుకుని రిలాక్స్డ్ గా ఒకేసారి దీపావళికి టీజర్ విత్ సినిమా రిలీజ్ డేట్ తో ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.వెటరన్ హీరోయిన్ టబు,మలయాళీ నటుడు జయరామ్,నివేతా పేతురాజ్,సుషాంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.గీత ఆర్ట్స్,హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.