యాప్నగరం

‘సర్కారు వారి పాట’ క్రేజీ అప్‌డేట్.. కీలక పాత్రలో అనుష్క!

మహేశ్‌బాబు, పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సర్కారు వారి పాట సినిమాలో అనుష్క నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనుందట

Samayam Telugu 22 Nov 2020, 7:38 am
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు భలే క్రేజ్ ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్లపై యూనిట్లు అధికారికంగా ప్రకటించకపోయినా సోషల్‌మీడియాలో మాత్రం పుకార్లు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మహేష్‌బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా అనుష్క నటించనుందన్నదే ఆ వార్త.
Samayam Telugu Image


Also Read: ఇద్దరితో డేటింగ్ చేశా.. మరొకరితో రిలేషన్లో ఉన్నా: తేజస్వి బోల్డ్ కామెంట్స్

‘సర్కారువారిపాట‌’ చిత్రంలో అనుష్క శెట్టి ఓ బ్యాంక్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌నుందట. కథకు కీలకంగా ఉండే ఈ పాత్రకు అనుష్క అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతానికి ఇది ప్రచారం మాత్రమే.. యూనిట్‌ అధికారికంగా ప్రకటిస్తేనే ఇది నిజమయ్యే అవకాశాలున్నాయి.

Also Read: అందాలు ఆరబోస్తున్న ‘టెంపర్’ బ్యూటీ.. చూసి తట్టుకోవడం కష్టమే

గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖలేజా’లో మహేశ్‌బాబు, అనుష్క జంటగా నటించిన సంగతి తెలిసిందే. అయితే వెండితెరపై వీరి జోడీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ‘సర్కారు వారి పాట’ హీరోయిన్‌గా మహానటి కీర్తి సురేష్‌ను ఎంపిక చేశారు. రెగ్యులర్ షూటింగ్ కోసం యూనిట్ త్వరలోనే అమెరికాకు వెళ్లనుంది.

Also Read: కేసీఆర్ ఆంధ్రోళ్లను తరిమికొడతారన్నారు.. ఇప్పుడేమైంది: పోసాని

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.