యాప్నగరం

Karnam Malleswari Biopic: ఆ హీరోయిన్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్!

భారత దేశానికి ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన కరణం మల్లీశ్వరి జీవిత కథలో హీరోయిన్‌గా తాప్సిని కన్ఫర్మ్ చేయనున్నారని తెలిసింది. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు చేస్తోందట చిత్రయూనిట్.

Samayam Telugu 3 Jun 2020, 3:11 pm
వెండితెరపై ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళ కరణం మల్లీశ్వరి జీవితాన్ని ఆవిష్కృతం చేయనున్న సంగతి తెలిసిందే. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత దేశానికి ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన కరణం మల్లేశ్వరి జీవిత కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జూన్ 1వ తేదీ క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది.
Samayam Telugu కరణం మల్లీశ్వరి బయోపిక్_ ఆ హీరోయిన్_ని ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్!
Taapsee Pannu


ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్.. కరణం మల్లీశ్వరి పాత్రలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలనే వేటలో పడ్డారు. ఈ క్రమంలో ముందుగా కీర్తి సురేష్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల చివరకు తాప్సిని తీసుకోవాలని ఫైనల్ అయ్యారట.

Also Read: పెళ్ళికి రెడీ అయిన నయనతార.. బాజా బజంత్రీ ఏర్పాట్లు.. ఈ సడెన్ డిసీజన్‌కి కారణాలివే!

ఈ మేరకు తాప్సితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. తాప్సి కూడా ఈ బయోపిక్ చేసేందుకు ఆసక్తి చూపించిందని టాక్. కరణం మల్లీశ్వరి ఒలంపిక్స్ సాదించేందుకు పడిన తపన, ఆమె కృషిని ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపనున్నారట. అన్నీ కుదిరితే అతి త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారట. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూట్, నటీనటుల వివరాలు ప్రకటించనున్నారని తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.