యాప్నగరం

నాగ చైతన్య- సాయి పల్లవి 'లవ్ స్టోరీ'కి భారీ డిమాండ్.. ఎంటరైన బడా నిర్మాత!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. ఈ హక్కులను అల్లు అరవింద్ దక్కించుకున్నట్లు టాక్.

Samayam Telugu 3 Jun 2020, 3:43 pm
అక్కినేని నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా రూపొందుతున్న కొత్త సినిమా 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి నెలలోనే విడుదల కానుందని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, ఆ వెంటనే లాక్‌డౌన్ అమలులోకి రావడంతో ఇప్పటికీ విడుదల కాలేదు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మూవీ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది చిత్రయూనిట్.
Samayam Telugu నాగ చైతన్య- సాయి పల్లవి లవ్ స్టోరీకి భారీ డిమాండ్.. ఎంటరైన బడా నిర్మాత!
Love Story


గతంలో ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన ఇష్టసఖుడు నాగ చైతన్యను కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతూ.. కళ్లు మూసుకుని ప్రేమ తన్మయం పొందుతున్న సాయి పల్లవి లుక్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్స్‌ని బట్టి చూస్తే ఈ మూవీలో నాగ చైతన్య- సాయి పల్లవి రొమాంటిక్ డోస్ ప్రేక్షకలోకాన్ని ఫిదా చేస్తుందని స్పష్టంగా తెలిసింది. దీంతో చిత్ర శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది.

Also Read: Karnam Malleswari Biopic: ఆ హీరోయిన్‌ని ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్!

'లవ్ స్టోరీ'కి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి సేల్ అయ్యాయి. ఈ హక్కులన్నీ కలిపి మొత్తంగా 16 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. ఈ డీల్ టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ కుదుర్చుకున్నారని టాక్. ఇక ఈ సినిమా ఆగష్టులో థియేటర్లలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఏది ఏమైనా ఈ ఫీల్ గుడ్ స్టోరీ కోసం యూత్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.