బాహుబలి సిరీస్ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీరఆర్లు హీరోలుగా నటిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా కథా కథనాలకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కి్ల్స్లో వినిపిస్తోంది.
వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు కాలాల్లో తిరుగుబాటు చేసిన ఇద్దరు పోరాట యోధుల కథకు ఫిక్షన్ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరు అజ్ఞాతంలో ఉన్న కాలానికి సంబంధించిన సన్నిశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా జక్కన్న ఇప్పటికే ప్రకటించాడు. హాలీవుడ్ మూడ్ మోటర్ సైకిల్ డైరీస్ ఈ సినిమాకు ఇన్సిపిరేషన్ అన్న హింట్ కూడా ఇచ్చాడు రాజమౌళి. అయితే తాజాగా ఈ సినిమాలో కీలకమైన ట్విస్ట్ ఇదే అంటూ ఓ న్యూస్ మీడియా సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది.
Also Read: `సాహో` నిర్మాతలపై చీటింగ్ కేసు
సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కారట. ఒకే వ్యక్తిలోని రెండు కోణాలను ఇద్దరు వ్యక్తులుగా చూపించనున్నాడట రాజమౌళి. గతంలో ఇదే స్క్రీన్ప్లే టెక్నిక్తో అ!, కంచెరపాలెం లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో అ! నిరాశపరచగా కంచెరపాలెం మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ను కమర్సియల్ హంగులతో భారీగా తెరకెక్కిస్తున్నారట.
నిజంగా సినిమా ఇదే ట్విస్ట్తో రూపొందితే అభిమానులకు నిరుత్సాహం తప్పదు. ఇద్దరు యంగ్ జనరేషన్ టాప్ స్టార్స్ను ఒకేసారి తెర మీద చూడాలన్న ఆశతో మెగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్టుగా సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్లు ఇద్దరు కాదు ఒక్కరే అన్నది నిజమైతే. ఆ ఇద్దరు స్టార్స్ను ఒకేసారి తెర మీద చూసే అవకాశమే లేదు. అంటే ఎన్టీఆర్, రామ్చరణ్లను ఒకేసారి తెర మీద చూడాలన్న అభిమానుల కోరిక తీరదన్నమాట.
Also Read: ‘రాజుగారి గది 3’ సినిమా రివ్యూ
ఈ వార్తలపై ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఇంత వరకు స్పందిచలేదు. ప్రస్తుతం షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన రాజమౌళి, బాహుబలి టీంతో కలిసి లండన్ టూర్లో ఉన్నాడు. టూర్నుంచి తిరిగి వచ్చాక ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ సీనియర్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్కు జోడిగా విదేశీ భామను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.
వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు కాలాల్లో తిరుగుబాటు చేసిన ఇద్దరు పోరాట యోధుల కథకు ఫిక్షన్ను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరు అజ్ఞాతంలో ఉన్న కాలానికి సంబంధించిన సన్నిశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా జక్కన్న ఇప్పటికే ప్రకటించాడు. హాలీవుడ్ మూడ్ మోటర్ సైకిల్ డైరీస్ ఈ సినిమాకు ఇన్సిపిరేషన్ అన్న హింట్ కూడా ఇచ్చాడు రాజమౌళి. అయితే తాజాగా ఈ సినిమాలో కీలకమైన ట్విస్ట్ ఇదే అంటూ ఓ న్యూస్ మీడియా సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది.
Also Read: `సాహో` నిర్మాతలపై చీటింగ్ కేసు
సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కారట. ఒకే వ్యక్తిలోని రెండు కోణాలను ఇద్దరు వ్యక్తులుగా చూపించనున్నాడట రాజమౌళి. గతంలో ఇదే స్క్రీన్ప్లే టెక్నిక్తో అ!, కంచెరపాలెం లాంటి సినిమాలు వచ్చాయి. వీటిలో అ! నిరాశపరచగా కంచెరపాలెం మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ను కమర్సియల్ హంగులతో భారీగా తెరకెక్కిస్తున్నారట.
నిజంగా సినిమా ఇదే ట్విస్ట్తో రూపొందితే అభిమానులకు నిరుత్సాహం తప్పదు. ఇద్దరు యంగ్ జనరేషన్ టాప్ స్టార్స్ను ఒకేసారి తెర మీద చూడాలన్న ఆశతో మెగా నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్టుగా సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్లు ఇద్దరు కాదు ఒక్కరే అన్నది నిజమైతే. ఆ ఇద్దరు స్టార్స్ను ఒకేసారి తెర మీద చూసే అవకాశమే లేదు. అంటే ఎన్టీఆర్, రామ్చరణ్లను ఒకేసారి తెర మీద చూడాలన్న అభిమానుల కోరిక తీరదన్నమాట.
Also Read: ‘రాజుగారి గది 3’ సినిమా రివ్యూ
ఈ వార్తలపై ఆర్ఆర్ఆర్ టీం మాత్రం ఇంత వరకు స్పందిచలేదు. ప్రస్తుతం షూటింగ్కు బ్రేక్ ఇచ్చిన రాజమౌళి, బాహుబలి టీంతో కలిసి లండన్ టూర్లో ఉన్నాడు. టూర్నుంచి తిరిగి వచ్చాక ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ సీనియర్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్కు జోడిగా విదేశీ భామను వెతికే పనిలో ఉన్నారు చిత్రయూనిట్.