యాప్నగరం

పవన్ కళ్యాణ్‌కు మరింత భద్రత.. రంగంలో ఎక్స్-ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చుట్టూ కొన్ని అసాంఘిక శక్తులు తిరుగుతున్నాయని.. ఆయనకి హాని తలపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని పార్టీ వర్గాలు చాలా రోజులుగా ఆరోపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించారని.. ఆయనపై దాడికి కుట్ర చేస్తున్నారని నెల రోజుల క్రితం జనసేన పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన తెలంగాణ పోలీసులు రెక్కీ జరగలేదని తేల్చారు. అయినప్పటికీ పార్టీ వర్గాలు జనసేనాని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 2 Dec 2022, 8:19 pm

ప్రధానాంశాలు:

  • జనసేనాని కోసం కొత్త భద్రతా సిబ్బంది?
  • ఎక్స్-ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను దించారంటూ ప్రచారం
  • ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌లో బిజీగా పవర్ స్టార్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan Kalyan
పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అటు రాజకీయాలతో, ఇటు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు ఏపీలో సీరియస్‌గా రాజకీయాలు చేస్తూనే మరోవైపు హైదరాబాద్‌లో సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే, జనసేనాని భద్రత విషయంలో ఆయన అనుచరులు, అభిమానులు చాలా రోజులుగా ఆందోళనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌‌కు హాని కలిగించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు రెక్కీ నిర్వహించారని.. ఆయనపై దాడికి కుట్ర పన్నారని నెల రోజుల క్రితం జనసేన పార్టీ వర్గాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరపాలని కేంద్ర మంత్రి కిషణ్‌రెడ్డి సైతం అప్పట్లో స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు.. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని తేల్చి చెప్పారు. కొందరు యువకులు పవన్ ఇంటిముందు ఆయన సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారని.. వారు రెక్కీ నిర్వహించలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ జనసేనాని భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వింగ్‌లో కొత్తగా సిబ్బంది చేరారనే వార్త వైరల్ అవుతోంది.

ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన 10 మంది మాజీ ఉద్యోగులను జనసేనాని భద్రత కోసం నియమించుకున్నారని సోషల్ మీడియాలో కొందరు అంటున్నారు. ఈ మేరకు సెక్యూరిటీ సిబ్బంది ఇంటి బయట రోడ్డుపై నిలబడి చర్చించుకుంటోన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది. ఈ సెక్యూరిటీ సిబ్బంది నియామకంపై త్వరలోనే పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. దీనిలో నిజమెంతో తెలీదు కానీ.. పవన్ కళ్యాణ్ భద్రతపై పార్టీ ఎంత జాగ్రత్త తీసుకుంటుందో అంటూ ఆయన అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఒకవైపు రాజకీయ పరమైన అంశాలను చూసుకుంటూనే మరోవైపు చిత్రీకరణ పూర్తిచేస్తున్నారు. బీఎండబ్ల్యూ సూపర్ బైక్‌పై పవన్ కళ్యాణ్ రయ్యిమంటూ వెళ్తోన్న వీడియో, ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఇలా బైక్‌పై వెళ్లారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తోన్న ఈ చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.