యాప్నగరం

ఒక్కపైసా ఖర్చు లేకుండా హనీమూన్.. భర్తకు రూ.5 కోట్లు ఆదా చేసిన కాజల్!

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక్కపైసా ఖర్చు చేయకుండా హనీమూన్ ఎంజాయ్ చేశారు. ఈ పది రోజుల హనీమూన్ ట్రిప్‌‌కు నిజానికి రూ.5 కోట్ల ఖర్చవుతుందట.

Samayam Telugu 7 Dec 2020, 2:59 pm
తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన కాజల్ అగర్వాల్ అక్టోబర్ 30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాను ప్రేమించిన వ్యక్తిని ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో కాజల్ పెళ్లాడారు. పెళ్లి తరవాత రోజే ఈ జంట ముంబైలోని కొత్త ఇంటిలో గృహప్రవేశం చేసింది. అక్కడ వారం రోజులు గడిపిన తరవాత హనీమూన్ కోసం మాల్దీవులు వెళ్లింది. మాల్దీవుల్లో కాజల్ హనీమూన్‌ను ఎంజాయ్ చేసిన ఫొటోలను ఇప్పటికే అంతా సోషల్ మీడియాలో చూశారు.
Samayam Telugu భర్త గౌతమ్‌తో కాజల్
Kajal Aggarwal official Instagram


హిందూ మహా సముద్రంలో 16 అడుగుల దిగువన నిర్మించిన ‘ది మురక’ హోటల్‌లో కాజల్, గౌతమ్ స్టే చేశారు. ఇది ప్రపంచంలోనే తొలి అండర్ వాటర్ హోటల్. అండర్ వాటర్‌లో తన గ్లాస్ రూమ్‌లో నుంచి తీసుకున్న ఫొటోలను కూడా కాజల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆ గాజు గదిలో నుంచి కొన్ని వేల అందమైన చేపలు ఈదుకుంటే వెళ్తుంటే చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. మరి ఇంత అందమైన అనుభూతిని ఇచ్చే హోటల్‌కు అద్దె కూడా అదే స్థాయిలో ఉంటుంది కదా!
View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)
ది మురక హోటల్‌లో ఒక్క రాత్రికి 50 వేల డార్లు చెల్లించాలి. అంటే, మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా 38 లక్షల రూపాయలు. బాలీవుడ్ మీడియా రిపోర్ట్ ప్రకారం ఈ హోటల్‌లో కాజల్ అగర్వాల్ జంట 10 రోజులు స్టే చేసింది. దీంతో హోటల్ అద్దె, ఆహారం, ఇతర సైట్‌సీయింగ్ ఖర్చులతో కలుపుకుని మొత్తం మీద కాజల్‌కు అయిన ఖర్చు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు. అయితే, ఈ ఐదు కోట్ల రూపాయలను కాజల్ జంట హోటల్‌కు చెల్లించలేదట.

See Photos: సందడిగా నిహారిక పెళ్లికూతురు ఫంక్షన్.. ఆశీర్వదించిన చిరంజీవి

బాలీవుడ్ నుంచి వస్తోన్న సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ఒక్క పైసా ఖర్చు లేకుండా తమ హనీమూన్‌ను ఎంజాయ్ చేశారట. మాల్దీవులు పర్యాటక రంగాన్ని ఇతర దేశాల్లో ప్రమోట్ చేసేందుకు ముఖ్యంగా ఇండియాలో ప్రమోట్ చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నడుం బిగించిందట. దీనిలో భాగంగా ఇండియాలోని సెలబ్రిటీలను ఉపయోగించుకోవాలని మాల్దీవులు ప్రభుత్వం నిర్ణయించిందని అంటున్నారు.
View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)
ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలకు ఫైవ్ స్టార్ మీల్స్ ఉచితంగా అందిస్తోందట. అలాగే, 5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలకు ఫైవ్ స్టార్ మీల్స్‌తో పాటు హోటల్ అద్దె కూడా ఉచితం. 5 మిలియన్ల కన్నా ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలకు గది అద్దె, భోజనం, రిటర్న్ టిక్కెట్లు కూడా ఉచితంగా అందిస్తోందని అంటున్నారు. అది కూడా ఇద్దరికి ఉచితం. అయితే, ఈ ఉచితం కోసం సెలబ్రిటీలు చేయాల్సిందల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫొటోలు పోస్ట్ చేసి మాల్దీవులు పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడమే.

Also Read: నా పిల్లలు కోరుకున్న క్షణమిది: సునీత భావోద్వేగ పోస్ట్

కాజల్ అగర్వాల్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ది మురక హోటల్ కాజల్, గౌతమ్ జంటకు ఉచితంగా రూమ్, ఫుడ్, ప్రయాణ ఖర్చులు ఆఫర్ చేసిందట. కేవలం మీరు బట్టలు మాత్రమే తెచ్చుకోండి మిగిలినవి మాకు వదిలేయండి అని కాజల్‌కు బంపరాఫర్ ఇచ్చిందట. దీంతో మాల్దీవులు వెళ్లిన కాజల్ ది మురక హోటల్‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచి ప్రమోషన్ అందించారు.
View this post on Instagram A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial)
అయితే, ఈ కథంతా ముంబై మీడియా చెబుతున్నది మాత్రమే. దీనిలో నిజమెంతో తెలియాలి అంటే కాజల్ స్పందించాలి. చూద్దాం ఆమె స్పందిస్తారో.. లేదంటే ఇదో గాలి వార్త అని వదిలేస్తారో! ప్రస్తుతానికి హనీమూన్ నుంచి తిరిగొచ్చిన కాజల్ షూటింగ్ షురూ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. చిరంజీవితో ‘ఆచార్య’, కమల్ హాసన్‌తో ‘ఇండియన్ 2’ సినిమాల్లో నటిస్తున్నారు. డీకే, కళ్యాణ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న సినిమాను ఇటీవల కాజల్ అంగీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.