యాప్నగరం

మెగా అభిమానులకు క్రేజీ అప్‌డేట్: రామ్ చరణ్‌ కోసం కొరటాల స్కెచ్!!

చిరంజీవి- కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఆయన సరసన రష్మిక మందనను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 1 Jun 2020, 9:45 am
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న మెగా ప్రాజెక్టు 'ఆచార్య' మూవీలోనూ భాగం కాబోతున్నారు చెర్రీ. షూటింగ్స్ రీ ఓపెన్ అయిన వెంటనే ఈ రెండు సినిమాల సెట్స్‌పైకి ఆయన వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే 'ఆచార్య'లో చరణ్ కోసం వేట ప్రారంభించిన కొరటాల.. చివరకు ఓ క్రేజీ బ్యూటీని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu మెగా అభిమానులకు క్రేజీ అప్_డేట్_ రామ్ చరణ్_ కోసం కొరటాల స్కెచ్!!
Koratala Ram Charan


ఇటీవలి కాలంలో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందనను రామ్ చరణ్ సరసన నటింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపుల కార్యక్రమాలు కూడా జరుపుతున్నారని టాక్. మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ని కన్ఫర్మ్ చేశారు కొరటాల శివ.

Also Read: పూరి కథ కోసం ఎదురుచూస్తున్నా.. మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

లేటెస్ట్ సమాచారం మేరకు 'ఆచార్య' మూవీలో రామ్ చరణ్ రోల్ చాలా కీలకం అని తెలుస్తోంది. చర‌ణ్ పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చిరంజీవికి మార్గ‌నిర్దేశం చేసేలా ఉంటుందని సమాచారం. దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ మూవీ కథ సిద్ధం చేసిన కొరటాల శివ.. మెగా అభిమానులు మెచ్చేలా ఆ కథకు తెర రూపం ఇవబోతున్నారట. సో.. రామ్ చరణ్ సరసన రష్మిక అని వస్తున్న ఈ క్రేజీ అప్‌డేట్ ఎంత వరకు నిజం కానుందో చూద్దాం మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.