యాప్నగరం

Lakshmi Pranathi: ఎన్టీఆర్ సతీమణి న్యూ స్టెప్.. ఆయన ప్రోత్సాహంతో మీడియా రంగంలోకి!

ఇన్నాళ్లు హౌస్‌వైఫ్‌గా ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి.. మరికొద్ది రోజుల్లో మీడియా రంగంలోకి అడుగు పెట్టనుందని తెలుస్తోంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎన్టీఆర్ ప్రోత్సాహం ఉందని సమాచారం.

Samayam Telugu 21 Jun 2020, 4:39 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి కొత్త బాధ్యతలు చేపట్టనుందని తెలుస్తోంది. 2011లో ఎన్టీఆర్‌ని పెళ్లాడిన ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి ఇన్నాళ్లు హౌస్‌వైఫ్ గానే కొనసాగింది. అయితే ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెట్టాలనే దిశగా ప్లాన్ చేస్తోందట లక్ష్మిప్రణతి. ఈ మేరకు త్వరలోనే ఓ ఎంట‌ర్‌‌టైన్‌‌మెంట్ ఛానెల్‌కు మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు చేపట్టబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Samayam Telugu ఎన్టీఆర్ సతీమణి న్యూ స్టెప్.. మీడియా రంగంలోకి లక్ష్మిప్రణతి! ఆయన ప్రోత్సాహంతోనే..
Ntr Lakshmi Pranathi


'యువ' అనే పేరుతో ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఛానెల్‌‌కు సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని టాక్. గతంలో లక్ష్మి ప్రణతి తండ్రికి ఓ మీడియా ఛానల్ నడిపించిన అనుభవం ఉన్నందున, దాని మీద ఐడియా ఉండటంతో ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌కి మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీకరించేందుకు ఆమె రెడీ అయిందట. కాగా లక్ష్మి ప్రణతి తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎన్టీఆర్ ప్రోత్సాహం కూడా ఉందని తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లోనే స్పష్టత రానుందని తెలుస్తోంది.

Also Read: Ram Gopal Varma: ‘నగ్నం’ ట్రైలర్ 2.. బాబోయ్! అడల్ట్ కిక్ మామూలుగా లేదు

మరోవైపు సినిమాల పరంగా ఎన్టీఆర్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తన RRR సినిమాతో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ చేస్తూనే ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు ఎన్టీఆర్. అతిత్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.