యాప్నగరం

సమంత ‘సామ్ జామ్’.. చిరంజీవికి భారీ మొత్తం చెల్లిస్తోన్న అరవింద్!

సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షోలో చిరంజీవి పాల్గొంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఎపిసోడ్ ‘ఆహా’లో అందుబాటులోకి రానుంది.

Samayam Telugu 20 Nov 2020, 6:29 pm
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ తన బిజినెస్‌ను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా దీపావళి నుంచి కొత్త తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారు అరవింద్. అల్లు అర్జున్‌తో ‘ఆహా’ను ప్రమోట్ చేయిస్తున్నారు. అలాగే, స్టార్ హీరోయిన్ సమంతతో ‘సామ్ జామ్’ అనే టాక్ షోను ప్లాన్ చేశారు. ఒక భారీ ఈవెంట్ పెట్టి ఈ షోను అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ, చిరంజీవి, తమన్నా, అల్లు అర్జున్, రష్మిక మందన వంటి స్టార్లు ఈ షోలో పాల్గొనబోతున్నారని ప్రకటించారు.
Samayam Telugu సమంత, చిరంజీవి
Samantha Sam Jam


తొలి ఎపిసోడ్‌లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చారు. కానీ, ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ‘సామ్ జామ్’ ఫ్లాప్ అంటూ విమర్శలు మొదలైపోయాయి. అందుకే అల్లు అరవింద్.. చిరంజీవిని రంగంలోకి దించారట. నిజానికి చిరంజీవి ఎపిసోడ్‌ను గ్రాండ్ ఫినాలేగా డిజైన్ చేశారట. కానీ, షోపై ప్రస్తుతం నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో దాన్ని మార్చడానికి ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్‌ను ముందుకు తీసుకొచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబో రిపీట్.. 13 ఏళ్ల తర్వాత ‘ఢీ’ సీక్వెల్!

అంతేకాదు, చిరంజీవిని ఈ షోకు తీసుకురావడానికి అల్లు అరవింద్ భారీ మొత్తం చెల్లించారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఎంత మొత్తం అనే విషయం బయటకు రాలేదుకానీ ఎక్కువేనని టాక్. చిరంజీవి ‘సామ్ జామ్’ షోలో పాల్గొనడానికి వెళ్తున్న స్టిల్స్, షోలో పాల్గొన్న ఫొటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, చిరు ఈ షోకు ఎంతగా ఉపయోగపడతారో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.