మాస్ ఫాన్స్ పుష్కలంగా ఉన్న హీరో బాలకృష్ణ. కమర్షియల్ ఎలిమెంట్స్తో థియేటర్స్లో ప్రేక్షకుల చేత ఈలలు వేయించగల సమర్థుడు బోయపాటి శీను. వీళ్లిద్దరు కలిస్తే ఎలా ఉంటుందనేది ఇదివరకే ప్రూవ్ అయింది. ''సింహా, లెజెండ్'' సినిమాలతో నందమూరి అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు ఈ ఇద్దరూ. అదే జోష్లో ఇప్పుడు 'అఖండ' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి అభిమానులు కోరుకునే ప్రతిఒక్క అంశం ఉండేలా ప్లాన్ చేశారట. మరీ ముఖ్యంగా ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారట బోయపాటి. ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావలసి ఉండగా.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే మళ్లీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో సెట్స్ మీదకు రాబోతున్నారట. జులై మొదటివారం నుంచి హైదరాబాద్ శివార్లలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడే బాలకృష్ణ, ఇతర నటీనటులతో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారట. దసరాకు ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం సినిమాపై భారీ తీసుకొచ్చింది. అఘోరాగా, అలాగే కలెక్టర్గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారని సమాచారం. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావలసి ఉండగా.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అయితే మళ్లీ ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో సెట్స్ మీదకు రాబోతున్నారట. జులై మొదటివారం నుంచి హైదరాబాద్ శివార్లలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడే బాలకృష్ణ, ఇతర నటీనటులతో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారట. దసరాకు ఈ సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తుండటం సినిమాపై భారీ తీసుకొచ్చింది. అఘోరాగా, అలాగే కలెక్టర్గా రెండు బలమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారని సమాచారం. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.