యాప్నగరం

అనుష్క స్థానంలో పూజా హెగ్డే!

‘శాకుంతలం’ సినిమాలో అనుష్క హీరోయిన్ కావచ్చని అంతా భావించారు. అయితే, గుణశేఖర్ మైండ్‌లో మాత్రం పూజా హెగ్డే ఉన్నారని టాక్.

Samayam Telugu 12 Oct 2020, 7:45 pm
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తన కుమార్తె నీలిమ గుణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘శాకుంతలం’ అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నట్టు గుణశేఖర్ ప్రకటించారు. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
Samayam Telugu పూజా హెగ్డే, అనుష్క
Pooja Hegde and Anushka


అయితే, ఈ సినిమాను గుణశేఖర్ ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ రోల్ ఎవరి పోషిస్తున్నారు అనే విషయంపై చర్చ మొదలైంది. గతంలో గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో వచ్చిన ‘రుద్రమదేవి’లో నటించిన అనుష్క శెట్టి.. ‘శాకుంతలం’లోనూ టైటిల్ రోల్ పోషిస్తారని రూమర్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ రూమర్ మరో మలుపు తిరిగింది. శకుంతల పాత్ర పోషించేది అనుష్క కాదని.. పూజా హెగ్డే అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం.

Also Read: మారేడుమిల్లి అడవుల్లో బన్నీ పోరాటాలు.. ఫిక్స్ చేసిన సుకుమార్!

శకుంతల పాత్రకు పూజా అయితే బాగుంటారని దర్శకుడు గుణశేఖర్ భావిస్తున్నారట. అయితే, ఆమెను ఇంకా గుణశేఖర్ కలవలేదని అంటున్నారు. ప్రస్తుతం పూజా ‘రాధేశ్యామ్’ షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్లారు. ఆమె అక్కడి నుంచి వచ్చిన తరవాత గుణశేఖర్ కలిసి కథ చెబుతారట. ఆమె ఓకే చెప్తే సరేసరి.. లేకుంటే ప్రత్యామ్నాయంగా సమంతని కూడా గుణశేఖర్ పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ రూమర్‌లో నిజమెంతో.. శకుంతల పాత్రలో ఎవరి నటిస్తారో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే, ‘రుద్రమదేవి’ సినిమా తరవాత ‘హిరణ్యకశ్యప’ చిత్రాన్ని గుణశేఖర్ ప్రకటించారు. రానా ప్రధాన పాత్ర పోషించనున్నట్టు వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను పక్కనబెట్టి ‘శాకుంతలం’ను ప్రకటించారు గుణశేఖర్. ‘హిరణ్యకశ్యప’ మాత్రం ఎలాంటి అప్‌డేట్ లేదు. ‘రుద్రమదేవి’ సినిమాతో నిర్మాతగా బాగా నష్టపోయిన గుణశేఖర్.. ‘శాకుంతలం’తో హిట్ అందుకుని లాభాల బాట పట్టాలని కోరుకుందాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.